జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకుడు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకుడు

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

- - Sakshi

పార్వతీపురం: జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల వ్యయపరిశీలకుడిగా రమాకాంత్‌ ప్రధాన్‌ను, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం వ్యయపరిశీలకుడిగా గురుకరణ్‌ సింగ్‌ను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు జిల్లా వ్యయ పరిశీలకుడు రమాకాంత్‌ ప్రధాన్‌ గురువారం జిల్లాకు చేరుకున్నారు. జిల్లాకేంద్రంలోని డా.వైఎస్‌ఆర్‌ ఉద్యాన కళాశాలలోని అతిథి గృహం–2లో ఆయన బసచేస్తారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను శాసనసభ నియోజక వర్గాల వ్యయ పరిశీలకుడు రమాకాంత్‌ ప్రధాన్‌ గురువారం సందర్శించారు. ఈ మేరకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌, సోషల్‌ మీడియా విభాగం, వ్యయవిభాగం, ఫిర్యాదుల విభాగం, చెక్‌ పోస్టుల పర్యవేక్షణ నియంత్రణ విభాగం, జియోట్యాగింగ్‌ వాహనాల పర్యవేక్షణ తదితర విభాగాలను ఆయన నిశితంగా పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌, అరకు పార్టమెంటరీ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ఎస్‌.శోభిక కమాండ్‌ కంట్రోల్‌ పనితీరును ఆయనకు వివరించారు. తొలుత కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్‌ కుమార్‌ను చాంబర్‌లో కలిసిన వ్యయ పరిశీలకుడు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పార్వతీపురం, కురుపాం శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవానాయుడు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారి, ఎస్‌డీసీ ఆర్‌వీ సూర్యనారాయణ, ఎంసీసీ నోడల్‌ అధికారి ఎం.డి.గయాజుద్దీన్‌, సోషల్‌ మీడియా నోడల్‌ అధికారి యు.సాయికుమార్‌, ఎంసీఎంసీ నోడల్‌ అధికారి ఎల్‌.రమేష్‌, సహయ వ్యయపరిశీలకులు ఆర్‌వీ.రమణమూర్తి, పర్యవేక్షకురాలు సుజాత పాల్గొన్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సందర్శన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement