![పార్టీలో చేరిన వారికి కండువా వేస్తున్న ఎమ్మెల్యే - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19bdn126f-250016_mr.jpg.webp?itok=r2d40bNM)
బోధన్: ప్రజా సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమవుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగర కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో సాలూర మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి ఆమె భర్త పార్టీ సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్, భవానీపేట మాజీ సర్పంచ్ కృష్ణ, 100 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బోధన్కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ సావిత్రి భర్త గంగాధర్ గౌడ్ కాంగ్రెస్లో శుక్రవారం చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, పీసీసీ డెలిగెట్ గంగాశంకర్, పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వర్రావు, మందర్న రవి, నాయకులు గణపతిరెడ్డి, నరేందర్రెడ్డి, నాయకులు ఇల్తెపు రమేశ్, కేజీ గంగారాం తదితరులు పాల్గొన్నారు.
● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి
● కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ బోధన్ ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment