వందే భారత్‌ రీషెడ్యూల్‌.. నాలుగు గంటల ఆలస్యం! | Vizag To Secunderabad Vande Bharat Express Train Rescheduled For Four Hours Late, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

వందే భారత్‌ రీషెడ్యూల్‌.. నాలుగు గంటల ఆలస్యం!

Published Sat, Jun 22 2024 10:35 AM | Last Updated on Sat, Jun 22 2024 10:58 AM

vizag secunderabad vande bharat train rescheduled for four hours late

ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వందే భారత్‌’ రైలు సుమారు నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ట్రైన్‌ సుమారు 4.15 గంటలకు ఆలస్యంగా సికింద్రాబాద్‌ చేరుకోనుంది.

 

అయితే రేపు ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్‌ను ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇక.. రీషెడ్యూల్‌ కారణంగా ఆలస్యం జరగనున్నట్లు సమాచారం. దీంతో ట్రైన్‌ ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్‌కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ‘ఎక్స్‌’లో వైరల్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement