కశ్మీర్‌లో లష్కరే కీలక కమాండర్‌ హతం | Top Lashkar commander among two killed in encounter in Jammu Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో లష్కరే కీలక కమాండర్‌ హతం

Published Tue, Jun 4 2024 4:32 AM | Last Updated on Tue, Jun 4 2024 4:32 AM

Top Lashkar commander among two killed in encounter in Jammu Kashmir

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా కీలక కమాండర్‌ రియాజ్‌ దార్‌ అలియాస్‌ సత్తార్‌ హతమయ్యాడు. కశ్మీర్‌ వ్యాలీ ఆపరేషనల్‌ కమాండర్‌గా వ్యవహరించే ఇతడి మృతి దక్షిణ కశ్మీర్‌లో లష్కరేకు కోలుకోలేని దెబ్బగా భద్రతా దళాలు పేర్కొన్నాయి. సోమవారం కార్డన్‌ సెర్చ్‌ సందర్భంగా ఉగ్రవాదులు దాగున్న ఇంటికి నిప్పంటుకుంది. 

ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒకరిని లష్కరే తోయిబా కశ్మీర్‌ వ్యాలీ ఆపరేషనల్‌ కమాండర్‌ రియాజ్‌ దార్‌ అలియాస్‌ సత్తార్‌గా, మరొకరిని రయీస్‌ దార్‌గా గుర్తించారు. 2015 నుంచి లష్కరేలో పనిచేస్తున్న సత్తార్‌కు గ్రెనేడ్‌ దాడులు, లక్షిత హత్యలు వంటి 20కి పైగా ఉగ్ర ఘటనలతో సంబంధముంది. కొన్నేళ్లుగా బలగాల కళ్లుగప్పి తిరుగుతున్న సత్తార్‌ పై రూ.10 లక్షలు, రయీస్‌పై రూ.5 లక్షల రివార్డున్నట్టు కశ్మీర్‌ ఐజీపీ వీకే బిర్ధి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement