![Road Accident: Car Enters Mumbai-Nagpur Expressway From Wrong Side](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/29/Mumbai-Accident.jpg.webp?itok=2snl7xl7)
ముంబై: ముంబై-నాగపూర్ ఎక్స్ప్రెస్వేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు రాంగ్ రూట్ వెళ్లి మరో కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సందర్భంగా సినిమా రేంజ్లో ఎగిరి బారికేడ్లపై పడింది.
వివరాల ప్రకారం.. ముంబైకి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో జల్నా జిల్లాలో ముంబై-నాగపూర్ ఎక్స్ప్రెస్వైపు ఓ కారు బీభత్సం సృష్టించింది. కడ్వాంచి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కారు డ్రైవర్ పెట్రోల్ ఫిల్ చేసుకున్న అనంతరం రాంగ్ రూట్లో హైవేపైకి వచ్చాడు. ఇలా రాంగ్ రూట్ నుంచి కారును క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్నాడు.
దీంతో, ఒక్కసారిగా కారు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న బారికేడ్లపై పడిపోయింది. కారులో ఉన్న వారంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక, ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment