PM Narendra Modi Returns To India After US And Egypt Visit - Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న ప్రధాని 

Published Mon, Jun 26 2023 8:33 AM | Last Updated on Mon, Jun 26 2023 10:26 AM

PM Narendra Modi Returns To India - Sakshi

న్యూఢిల్లీ: ఆరు రోజులపాటు అమెరికా,ఈజిప్ట్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా అమెరికా, ఈజిప్ట్‌లో చారిత్రక ఒప్పందాలు చేసుకున్నారు. ఈనెల 20న అమెరికా పర్యటన వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ నెల 21వ తేదీన ఐరాసలో ప్రపంచ యోగా దినోత్సవం పాల్గొన్నారు. 

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ.. రక్షణ, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా కాంగ్రెస్‌లో చారిత్రాత్మక ప్రసంగం చేశారు మోదీ. అమెరికా నుంచి ఈజిప్ట్ పర్యటనకు తొలిసారి వెళ్లారు. ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారంతో మోదీని ఈజిప్ట్ అధ్యక్షుడు సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement