రైలులో అగ్ని ప్రమాదం | Fire Breaks Out In 5 Coaches Of Train In Maharashtra | Sakshi
Sakshi News home page

రైలులో అగ్ని ప్రమాదం

Published Mon, Oct 16 2023 4:52 PM | Last Updated on Mon, Oct 16 2023 5:07 PM

Fire Breaks Out In 5 Coaches Of Train In Maharashtra - Sakshi

ముంబయి: మహారాష్ట్రలో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్‌ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ రైలులోని ఐదు కోచ్‌లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:  పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement