ఎండలే ఎండలు.. | - | Sakshi
Sakshi News home page

ఎండలే ఎండలు..

Published Thu, Apr 18 2024 9:35 AM | Last Updated on Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

అచ్చంపేట: ఈ వేసవిలో ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ ముందుస్తుగానే హెచ్చరించినట్లు భానుడు భగభగ మండుతున్నాడు. బుధవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతులు నమోదు కావడం విశేషం. కోడేరులో అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా అమ్రాబాద్‌ మండలం వట్టువర్లపల్లిలో 38.4గా నమోదైంది. 28 డిగ్రీలు నమోదైతేనే ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కానున్నారు. సగటున గరిష్ట ఉష్ణోగ్రత 43.6 డిగ్రీలకు చేరువైంది. కనిష్ట ఉష్ణోగ్రత సైతం సగటు 28.5 డిగ్రీలకు చేరింది. కల్వకుర్తి, బిజినేపల్లిలో 42.4, అచ్చంపేట మండలం ఐనోలు, వెల్దండలో 41.9, పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి, అచ్చంపేటలో 41.6, నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తిలో 41.4, కొల్లాపూర్‌లో 41.1, వెల్దండ మండలం బొల్లంపల్లి, లింగాలలో 40.8, వంగూరు మండలం కిష్టంపల్లి, చారకొండ మండలం సిరసనగండ్ల, పెంట్లవెల్లి మండలం జట్ర్‌పోల్‌లో 40.7, తిమ్మాజీపేట, ఉప్పునుంతల మండలం వెల్టూర్‌లో 40.5, పదర మండలం వంకేశ్వరంలో 40.3, కల్వకుర్తి మండలం తోటపల్లి, బల్మూర్‌ మండలం కొండనాగుల, తెలకపల్లి మండలం పెద్దూరులో 40.2, నాగర్‌కర్నూల్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement