కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభ్యున్నతి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభ్యున్నతి

Published Mon, Apr 15 2024 12:45 AM | Last Updated on Mon, Apr 15 2024 12:45 AM

మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి, చిత్రంలో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి   - Sakshi

నాగర్‌కర్నూల్‌రూరల్‌: కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి డా.మల్లు రవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు రూ.500లకే సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే, మరో ఐదు గార్యంటీలు అమలవుతాయని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement