మేజర్‌ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్‌     | Anurag And Sharath Feel Proud For Producing Major Movie | Sakshi
Sakshi News home page

మేజర్‌ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్‌    

Published Wed, Jun 8 2022 12:02 AM | Last Updated on Wed, Jun 8 2022 12:02 AM

Anurag And Sharath Feel Proud For Producing Major Movie - Sakshi

‘‘మేజర్‌’లాంటి గౌరవప్రదమైన సినిమా తీశాం. దేశమంతా మంచి పేరు వచి్చంది. ఈ సినిమాకు టైటిల్స్‌ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంటేనే సినిమా సక్సెస్‌ అయినట్లు లెక్క’’ అన్నారు నిర్మాతలు అనురాగ్, శరత్‌. అడివి శేష్‌ హీరోగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్‌’. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్, శరత్‌ మాట్లాడుతూ– ‘‘మాకు ఛాయ్‌ బిస్కట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ అనే నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఫస్ట్‌ షో మార్కెటింగ్‌ ఏజెన్సీ ద్వారా 200 సినిమాలు మార్కెటింగ్‌ చేశాం. ‘మేజర్‌’ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని అడివి శేష్‌ చెప్పాడు.

నమ్రతగారికి కూడా ఈ కథ నచ్చడంతో మాతో భాగమయ్యారు. ‘మేజర్‌’ని తెలుగు, హిందీలోనే తీద్దామనుకున్నాం. కేరళలో ఉండే సందీప్‌ తల్లిదండ్రులను కలిశాక మలయాళంలోనూ డబ్‌ చేశాం. సందీప్‌ తల్లిదండ్రులకు రాయల్టీ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నా వారు తిరస్కరించారు. ఆర్మీలో చేరాలనుకున్నవారికి తగిన సపోర్ట్‌గా నిలిచేలా మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఫౌండేషన్‌ అనే సోషల్‌ మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయలీ్ట. ‘రైటర్‌ పద్మభూషణ్, మేం ఫేమస్‌’ సినిమాలు నిర్మించాం. తొట్టెంపూడి వేణు లీడ్‌ రోల్‌లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement