![Amitabh Bachchan Meets Stalwarts Of Cinema Prabhas Nani Nag Ashwin - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2022/06/29/3.jpg.webp?itok=h1LBqBnD)
Amitabh Bachchan Meets Stalwarts Of Cinema Prabhas Nani Nag Ashwin: మన ఫేవరేట్ హీరోలందరూ ఒకే ఫ్రేమ్లో ఉంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఒక చిత్ర పరిశ్రమకు చెందిన మల్టీస్టారర్స్ కాకుండా వివిధ సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్ ఒకే చోట దర్శనమిస్తే. కన్నులకు ఆహా అనిపిస్తుంది. అలాంటి సంఘటన చోటుచేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే ఫ్రేమ్లో దర్శనమిచ్చి అభిమానులకు కనులవిందు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలను రూపొందించింది వైజయంతీ మూవీస్. ఈ సంస్థ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.
ఈ వేడుకలో అతిరథ సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, నాని, దుల్కర్ సల్మాన్, కె రాఘవేంద్ర రావు, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరందరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా వీరందరూ కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ బిగ్ బీ అమితాబ్ తన ఇన్స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. వీరంతా కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ 'సినీ ప్రముఖులతో ఒక సాయంత్రం. సినిమా విశేషాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ వేడుకకు సంబంధించిన అనుభూతి గురించి ఆయన బ్లాగ్లో తెలిపారు. కాగా వైరలైన ఈ ఫొటోను నెటిజన్లు 'పాన్ ఇండియా పిక్'గా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ బ్యానర్లోనే ప్రాజెక్ట్ కె తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. నాని ఇదే బ్యానర్లో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాల్లో నటించాడు. 'మహానటి' సినిమాతో విజయం అందుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 'సీతరామం' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఈ సంస్థలో వచ్చిన ఎన్నో హిట్ సినిమాలకు డైరెక్షన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment