![వీవీ ప్యాట్లను దింపుతున్న సిబ్బంది - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19bmp08-340077_mr.jpg.webp?itok=de_W7qea)
బెల్లంపల్లి: పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధి బెల్లంపల్లి బజార్ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్రూంకు ఎన్నికల సామగ్రి శుక్రవారం రాత్రి చేరింది. బెల్లంపల్లి నియోజకవర్గ సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ పర్యవేక్షణలో కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను తరలించారు. జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక డీజీటీ వ్యాన్లో పోలీసు బందోబస్తు మధ్య పార్లమెంటు ఎన్నికల్లో వినియోగించే 283 కంట్రోల్ యూనిట్లు, 283 బ్యాలెట్ యూనిట్లు, 315 వీవీ ప్యాట్లను రవాణా చేశారు. స్ట్రాంగ్ రూమ్కు చేరిన ఆయా ఎన్నికల సామగ్రి లెక్కలు సరి చూసుకుని ఎన్నికల అధికారులు, రాజకీయ పక్షాల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ ఎస్హెచ్ఓ ఎన్.దేవయ్య, ఎస్సైలు రమేష్, సురేష్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment