![కాసిపేట 2గనిపై మ్యాన్రైడింగ్ పనులు పరిశీలిస్తున్న జీఎం మనోహర్ - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19bmp51-340080_mr.jpg.webp?itok=yrgKdITO)
కాసిపేట: అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు రక్షణతో కలిసి కట్టుగా పనిచేస్తూ ప్రమాద రహిత ఉత్పత్తిని సాధించాలని మందమర్రి ఏరియా జీఎం మనోహర్ తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట 2గనిని సందర్శించారు. అధికారులతో కలిసి గనిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మ్యాన్రైడింగ్ పనులను పరిశీలించారు. గనిలో పని స్థలాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. త్వరలో మ్యాన్రైడింగ్ ప్రారంభంతో కార్మికుల ప్రధాన సమస్య తీరనుందని, ఉత్పత్తిపై దృష్టి సారించి లక్ష్యం చేరేలా అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణాధికారి రవీందర్, కెకె గ్రూప్ ఏజెంట్ రాందాసు, గ్రూప్ ఇంజనీర్ రాంప్రసాద్, గని మేనేజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment