![నగదు, నకిలీ తామ్రపాత్రను పరిశీలిస్తున్న నగర పోలీస్ కమిషనర్ దయానంద
- Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19bng105_mr.jpg.webp?itok=LF6dWfyI)
బనశంకరి/కృష్ణరాజపుర: రైస్ పుల్లింగ్పేరుతో నకిలీ తామ్రపాత్ర చూపించి వంచనకు పాల్పడిన ముగ్గురు వంచకులకు బేడీలు పడ్డాయి. పంజాబ్కు చెందిన సన్నిగిల్, తమిళనాడువాసి రమేశ్, బెంగళూరు నగరనివాసి శివశంకర్ అనే నిందితులను శుక్రవారం జయనగరపోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ. 69.79 లక్షల నగదు, నకిలీ తామ్రపాత్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జయనగర 6 వబ్లాక్ యడియూరుచెరువు వద్ద రైస్పుల్లింగ్ తామ్రపాత్ర విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. శుక్రవారం జయనగర పోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్చేశారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరిచారు. నిందితులనుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని 5 రోజులపాటు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా నిందితులు చాలా చోట్ల అనేక మందిని వంచించినట్లు పోలీసులు తెలిపారు.
రూ.69.79 లక్షలు స్వాధీనం
![నిందితులు వీరే](/sites/default/files/gallery_images/2024/04/24/19bng01b-120020_mr.jpg)
నిందితులు వీరే
![](/sites/default/files/gallery_images/2024/04/24/19bng01a-120020_mr.jpg)
![](/sites/default/files/gallery_images/2024/04/24/19bng01-120020_mr.jpg)
Comments
Please login to add a commentAdd a comment