![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19bng23b-120022_mr.jpg.webp?itok=FF5NvE4q)
బనశంకరి: లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు యువ ఓటర్లు ముందడుగు వేయాలని బెంగళూరు నగర జిల్లా ఎన్నికల అధికారి బీబీఎంపీ కమిషనర్ తుషార్గిరినాథ్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాగృతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన జాతాను లాల్బాగ్ 1వ మెయిన్గేట్ వద్ద తుషార్గిరినాథ్ ప్రారంభించి మాట్లాడారు. ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు ఈనెల 26న పోలింగ్ బూత్లకు వెళ్లి తమకు నచ్చిన వారికి ఓటు వేయాలన్నారు. బెంగళూరులో గత ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ జరిగిందని, ఓటింగ్ శాతం పెంచే దృష్టితో జాగృతి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహారాణి కాలేజీ, వివేకానందకాలేజీ, విజయకాలేజీ, ప్రభుత్వ ఆర్ట్స్కాలేజీతో పాటు 17 కాలేజీలనుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 4 కిలోమీటర్ల మేర జాగృతి కార్యక్రమం చేపట్టి వాకింగ్ కోసం వచ్చిన వారికి అవగాహన కల్పించారు. స్వీప్ సమితి అధ్యక్షుడు కాంతరాజు, జిల్లా స్వీప్ నోడల్ అధికారి ప్రతిభ పాల్గొన్నారు.
![జాగృతి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో తుషార్గిరినాథ్](/sites/default/files/gallery_images/2024/04/24/19bng23c-120022_mr.jpg)
జాగృతి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో తుషార్గిరినాథ్
Comments
Please login to add a commentAdd a comment