![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19bng44a-120033_mr.jpg.webp?itok=EtrNtFT8)
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని వివిధ లోక్సభ నియోజకవర్గాలు, గ్రామీణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వస్తుండడంతో కార్యకర్తల్లో, ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. నరేంద్ర మోదీ కార్యక్రమం శనివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని విహార్గేట్లో జరగనుందని తెలిపారు. శుక్రవారం ప్యాలెస్ మైదానంలో ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను విజయేంద్ర పరిశీలించి ఆ తర్వాత జరిగిన ప్రధాని భారీ బహిరంగ సభ కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయేంద్ర మాట్లాడుతూ చిక్కబళ్లాపుర కార్యక్రమం తర్వాత బెంగళూరులో ప్రధాని మోదీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 60 వేల మంది కూర్చొనేలా సీట్లను ఏర్పాటు చేసినట్లు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హుబ్లీలో జరిగిన ఘటన కేవలం వ్యక్తిగత కారణాలతో జరిగినట్లు సీఎం, హోం మంత్రి చెప్పడం శోచనీయమని, దేశద్రోహులకు రక్షణ కలిగించేలా వారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఒక్కరోజే 8 హత్య కేసులు నమోదు అయ్యాయని, ఇలా నేరాలు రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరు, చిక్కబళ్లాపురంలో బహిరంగ సభలు
ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర
Comments
Please login to add a commentAdd a comment