![మాలికయ్యకు పార్టీ జెండా అందజేస్తున్న
సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19bng28-120033_mr.jpg.webp?itok=jdbtnnZ_)
శివాజీనగర: మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్ శుక్రవారం బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. కేపీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాలికయ్య గుత్తేదార్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రులైన ప్రియాంక్ ఖర్గే, కే.ఎన్.రాజణ్ణ తదితరులు ఉన్నారు. మాలీకయ్య గుత్తేదార్కు కాంగ్రెస్ పార్టీ జెండా చేతికందించి పార్టీలోకి చేర్చుకొన్నారు.
శారదా మోహన్ శెట్టి చేరిక:
ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే శారదా మోహన శెట్టి సైతం కాంగ్రెస్లో చేరారు. ఈ సంద్భంగా ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ మాట్లాడుతూ.. మాలికయ్య గుత్తేదార్ గతంలో తమతోనే ఉండేవారు. అనివార్య కారణాలతో బయటికి వెళ్లారు. ఆయన శుక్రవారం పార్టీలోకి వెనుతిరిగి వచ్చారు. ఆయనతో పాటుగా ఆయన అనుచరులను కూడా పార్టీలో చేరారన్నారు. సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ...మాలికయ్య పార్టీలోకి రావడం మరింత కలిసివస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment