బెంగళూరు సెంట్రల్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం | - | Sakshi
Sakshi News home page

బెంగళూరు సెంట్రల్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం

Published Sat, Apr 20 2024 1:40 AM | Last Updated on Sat, Apr 20 2024 1:40 AM

కాంగ్రెస్‌ అభ్యర్థి మన్సూర్‌కు మద్దతుగా ప్రచారం - Sakshi

శివాజీనగర: పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పీ.సీ.మోహన్‌ పలు నియోజకవర్గాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. శుక్రవారం ఉదయాన్నే శాంతినగర నియోజకవర్గం దొమ్మలూరులోని పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత దొమ్మలూరు వార్డులోని దూపనహళ్లిలో ఇంటింటా ప్రచారం చేపట్టి, మరోసారి బీజేపీకి ఓటు వేసి అభివృద్ధి పనులు జరిగేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అదే విధంగా కాంగ్రెస్‌ అభ్యర్థి మన్సుర్‌ అలీఖాన్‌ శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని రాజాజీనగర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పవిత్ర పారడైస్‌ సర్కిల్‌, బసవేశ్వరనగర, శారదా కాలనీ, మంకి పార్క్‌, గౌతమ్‌ నగర, భాష్యం నగర, దయానంద్‌ నగర తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దొమ్మలూరు వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి పీ.సీ.మోహన్‌
1/1

దొమ్మలూరు వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి పీ.సీ.మోహన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement