ప్రైవేట్‌ బస్సులను వేరే చోటికి తరలించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బస్సులను వేరే చోటికి తరలించాలి

Published Sat, Apr 20 2024 1:40 AM | Last Updated on Sat, Apr 20 2024 1:40 AM

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం  - Sakshi

రాయచూరు రూరల్‌: నగరంలో ప్రైవేట్‌ బస్సులను వేరే చోటికి తరలించాలని జయ కర్ణాటక జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన జిల్లాధ్యక్షుడు శివకుమార్‌ యాదవ్‌ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ప్రతి నిత్యం ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యం బెంగళూరు, హుబ్లీ, మంగళూరు, హైదరాబాద్‌లకు వెళ్లే ట్రావెల్స్‌ యాజమాన్యాలు ప్రజలకు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ప్రైవేట్‌ బస్సులకు సరైన దాఖలాలు లేవని, ప్రయాణికుల వాహనాలుగా కాకుండా లగేజీ వాహనాలుగా మారాయన్నారు. అలాంటి వాహనాలను అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి దూర ప్రాంతాలకు తరలించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement