![ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే గణేష్ - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19blr07-120005_mr.jpg.webp?itok=I-bCeyUw)
హొసపేటె: బళ్లారి, విజయనగర జిల్లాల్లో విస్తరించిన లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుకారాం తరపున కంప్లి ఎమ్మెల్యే జేఎన్.గణేష్ శుక్రవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. బెళగోడుహాళు, అరళహళ్లి తండా, సణాపుర, ఇటిగి, నెంబర్ 02 ముద్దాపుర, ఆర్.కొండయ్య క్యాంపు, శంకర్సింగ్ క్యాంపు, హళే నెల్లుడి, హొస నెల్లుడి, కొట్టాల గ్రామాల్లో వేలాది మంది కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 7న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తుకారాంకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
సీఈటీ పరీక్ష ప్రశాంతం
కోలారు: జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో నిర్వహించిన సీఈటీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. భౌతికశాస్త్రం పరీక్షకు 338 మంది, రసాయనిక శాస్త్రం పరీక్షకు 339 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. సీఈటీ పరీక్షలను ఎలాంటి గందరగోళం లేకుండా ముగించినట్లు డీడీపీఐ రామచంద్రప్ప తెలిపారు. భౌతిక శాస్త్రానికి 8325 మంది హాజరు కావాల్సి ఉండగా 7987 మంది, అదే విధంగా మధ్యాహ్నం నిర్వహించిన రసాయనిక శాస్త్రం పరీక్షకు 9325 మంది రిజిష్టరు చేసుకోగా 7886 మంది హాజరైనట్లు తెలిపారు.
![పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు](/sites/default/files/gallery_images/2024/04/24/19kol05-120026_mr.jpg)
పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment