జగిత్యాల క్రైం: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద జగిత్యాల పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రాయికల్ మండలంలోని కిష్టంపేటకు చెందిన జనార్దన్ తన బైక్పై వస్తుండగా ఆపారు. ఆ వాహనంపై 47 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించి, సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో యజమాని జనార్దన్ మొత్తం రూ.12,805 చెల్లించి, సంబంధిత రసీదును పోలీసులకు అందజేయడంతో వాహనాన్ని అప్పగించారు.
● రూ.12,805 చెల్లించిన యజమాని
Comments
Please login to add a commentAdd a comment