![మాట్లాడుతున్న మేయర్ వై.సునీల్రావు - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19knt253-180090_mr.jpg.webp?itok=WGCHB6AB)
● వినోద్కుమార్ ప్రజల గొంగుకవుతాడు
● మేయర్ వై.సునీల్రావు
కరీంనగర్: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ నయాపైసా తేలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను ప్రజలు గెలిపిస్తే తమ సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకవుతాడని మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్ తీగలగుట్టపల్లి విజేత గ్రీన్హోమ్స్ కాలనీవాసులతో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ సమావేశం అయ్యారు. మేయర్ సునీల్ రావు మా ట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే బండికి ప్రజలు గుర్తుకువస్తున్నారని అన్నారు. వినోద్ కుమార్ 2014 నుంచి 2019వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు వెయ్యికోట్లతో స్మార్ట్సిటీ తీసుకొచ్చారని అన్నా రు. వినోద్కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలోనే తీగలగుట్టపల్లిని మున్సిపల్ కార్పొరేషన్లో కలిపి రైల్వే ఓవర్ బ్రిడ్జి తీసుకురా వడం జరిగిందన్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్ కల్యాణి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సాగర్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, శంకరయ్య, కరుణాకర్ గుప్త్తా, వాసుదేవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment