క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Published Tue, Apr 23 2024 8:15 AM | Last Updated on Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

గంజాయి మత్తులో కత్తితో దాడి

ఖలీల్‌వాడి: గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతుపై కత్తి తో పొడిచినట్లు ఆరోటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రమేశ్‌ తెలిపారు. అర్సపల్లి పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ వద్ద సోమవారం ఈ ఘటన చోటుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్‌ఖాన్‌ పాతకక్షల ను దృష్టిలో పెట్టుకొని ఫిరోజ్‌ఖాన్‌ అనే వ్యక్తి గొంతుపై కత్తితో పొడిచాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పరిస్థితి విషమించి ఒకరి మృతి

గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని పేట్‌సంగెం గ్రామానికి చెందిన సాలె కిషన్‌(50) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన కిషన్‌ను బైక్‌ ఢీకొట్టడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారన్నారు. కిషన్‌ సోమవారం ఉదయం మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

బాన్సువాడ : పట్టణంలోని కల్కి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ తెలిపారు. సోమవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని జాలర్ల సాయంతో బయటికి తీయించి ఆస్పత్రికి తరలించామన్నారు.

కుంటలో మరో మృతదేహం..

ఎడపల్లి(బోధన్‌): మండలంలోని శాటాపూర్‌ గేట్‌ వద్ద ఉన్న కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు ఉంటుందన్నారు. నలుపు రంగు షర్టు, నలుపు రంగు ప్యాంట్‌ ఉన్నాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement