![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19kmr109-250029_mr_0.jpg.webp?itok=Xae7y5mH)
భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో హైదరాబాద్కు చెందిన చందర్ హరిప్రసాద్ వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 60వేలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి జైలు
ఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి సయ్యద్ ఖదీర్ విధించినట్లు ఏసీపీ నారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 మందికి రూ. 17,600 జరిమానా విధించగా ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు.
యువతి అదృశ్యం
ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. శుక్ర వారం కుటుంబ సభ్యులు నిద్రలేచే సరికి అమ్మాయి తన గదిలో కనిపించకపోవడంతో కుటుంబీకులు పలు చోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పిడుగుతో ఐదుగురికి గాయాలు
మాక్లూర్: మండలంలోని ధర్మారంలో శుక్రవారం సాయంత్రం చలి పిడుగు తగిలి ఐదుగురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామ శివారులో ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పేందుకు వెళ్లిన సుంకరి ధర్మారం, సుంకరి నారాయణ, బన్నీ, సాకలి శంకర్పై చలిపిడుగు పడింది. దీంతో వారికి తిముర్లు వచ్చి అపస్మారకస్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వారికి చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment