ఓటు హక్కు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు వినియోగించుకోవాలి

Published Sat, Apr 20 2024 1:55 AM | Last Updated on Sat, Apr 20 2024 1:55 AM

- - Sakshi

జగిత్యాల: అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వీప్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటింగ్‌శాతం ఎక్కడైతే తక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పెంచేలా చూడాలని ఆదేశించారు. ఈనెల 20 నుంచి వ చ్చే నెల 11 వరకు రోజువారీ కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించి అవగాహన కల్పించాలన్నారు. వేసవి దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ఉన్నందున యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, దివాకర, ఆర్డీవో మధుసూదన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూం పరిశీలన

కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూంను పెద్దపల్లి పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు సమీర్‌ నరైంతర్‌ పరిశీలించారు. శుక్రవారం ఆయన జగిత్యాలకు రాగా కలెక్టర్‌ యాస్మిన్‌బాషా స్వాగతం పలికారు.

కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement