కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువును అనుసంధానిస్తూ వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు బుధవారం పట్టణంలో భిక్షాటన చేశారు. వర్షాకాలంలో చెరువునిండి ఆ వరద నీటితో 10, పదకొండో వార్డులు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత, పదో వార్డు బీజేపీ ఇన్చార్జి దాసరి శేఖర్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. మున్సిపల్ కౌన్సిల్ పట్టించుకోవటం లేదని, అందుకే భిక్షాటనతో నిధులు సేకరిస్తున్నామని వారు తెలిపారు. మరికొన్ని నిధులు మున్సిపల్ కౌన్సిల్ విడుదల చేసి చెరువు నీళ్ల కోసం వరద కాలువ నిర్మించాలని వారు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు మాడవేని నరేశ్, పెండెం గణేశ్, నాయకులు బల్మూరి మురళి, ఇందూరి తిరుమల, పోతుగంటి శ్రీనివాస్గౌడ్, గిన్నెల అశోక్, బింగి వెంకటేశ్, వాసాల నవీన్, వినయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
వరద కాలువ కోసం భిక్షాటన
Published Thu, Jun 22 2023 12:32 AM | Last Updated on Thu, Jun 22 2023 12:25 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
Advertisement
Comments
Please login to add a commentAdd a comment