పోలీసులపై చింతమనేని జులుం | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై చింతమనేని జులుం

Published Tue, Apr 23 2024 8:25 AM | Last Updated on Tue, Apr 23 2024 8:25 AM

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద పోలీసులతో 
వాగ్వివాదం చేస్తున్న చింతమనేని  
 - Sakshi

ఏలూరు టౌన్‌: అధికారులపై దౌర్జన్యం, దాడులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు కలెక్టరేట్‌ వద్దకు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయారు. శ్రీఓవరాక్షన్‌ చేయవద్దని చెప్పు... చేస్తే ఏం చేయాలో నాకు తెలుసు.. మీకు రెండు నిమిషాలే సమయం ఉంది.. నా స్ట్రెంగ్త్‌ ఎంతో తెలుసా.. ఏమీ లేకుండా బిల్డప్‌లు ఇవ్వొద్దు మీరంతాశ్రీ అంటూ విరుచుకుపడ్డారు. మేము 60 లక్షల మంది ఉన్నాం.. పోలీసులు మీరు ఎంతమందో తెలుసుగా.. అంటూ హూంకరించారు. మేము ప్రజా సేవకులం.. మీరు డబ్బులకు పనిచేస్తారు.. అంటూ చులకనగా మాట్లాడుతూ పోలీసులకు హెచ్చరికలు చేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసు కానిస్టేబుళ్లు చింతమనేని మాటలకు ఏం చెప్పాలో తెలియక నిశ్చేష్టులయ్యారు. చింతమనేని ధోరణి మారకపోవడంతో పోలీసులు అతని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద హడావిడి

మరోసారి నోరుపారేసుకున్న

చింతమనేని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement