డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర Rekki with a drone around Muthyalanaidu house | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర

Published Sun, May 5 2024 4:33 AM | Last Updated on Sun, May 5 2024 4:33 AM

Rekki with a drone around Muthyalanaidu house

బూడి ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ 

అనుమానంతో డ్రోన్‌ ఆపరేటర్లను పట్టుకున్న గ్రామస్తులు 

పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగింత 

తన అనుచరులతో కలిసి రివర్స్‌లో ఫిర్యాదు చేయించిన సీఎం రమేష్‌ 

దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్‌ కెమెరాతో నలుగురు  రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ  పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.

రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని  బూడి  ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్‌ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్‌ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఎస్‌ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌ ఆపరేటర్‌ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్‌ ఆపరేటర్‌ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

సీఎం రమేష్‌ ఎదురుదాడి 
విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్‌ డ్రోన్‌ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్‌ సిద్ధం కాగా..   పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్‌ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్‌ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్‌ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. 

 విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్‌ తన అనుచరులతో కలిసి హనుమాన్‌ ఆలయం ముందు మెట్లపై  కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు  అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.  పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్‌ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్‌ ఎక్కిన  జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. 

గూండాగిరీ  చేసిన సీఎం రమేష్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో  అరగంటకు పైగా సీఎం రమేష్‌ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్‌ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement