విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి..
Published
Mon, Jun 5 2023 4:41 PM
| Last Updated on Mon, Jun 5 2023 4:41 PM
సాక్షి, జోగులాంబ గద్వాల: జిల్లాలోని మానవపాడు మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతిచెందారు.
వివరాల ప్రకారం.. పల్లెపాడులో నలుగురు చిన్నారులు కలిసి కృష్ణా నదిలోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు చిన్నారులు నది నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో స్థానికులు వారిన రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నలుగురు చిన్నారులు మృతిచెందారు. కాగా, మృతిచెందిన వారిని అఫ్రీన్(17), రిహాన్(15), సమీర్(8), నౌషిన్(7)లుగా గుర్తించారు. ఇక, మృతిచెందిన చిన్నారులంతా ఒకే కుటుంబానికి వల్లూరు వాసులుగా స్థానికులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment