భద్రాద్రి కొత్తగూడెం: అప్పు తీర్చలేదని మహిళపై.. | Bhadradri Kothagudem Man Severely Attacked On Woman Over Loan | Sakshi
Sakshi News home page

భద్రాద్రి కొత్తగూడెం: అప్పు తీర్చలేదని మహిళపై..

Published Tue, May 3 2022 10:34 AM | Last Updated on Tue, May 3 2022 10:42 AM

Bhadradri Kothagudem Man Severely Attacked On Woman Over Loan - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆర్థిక లావాదేవీలతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో పరిధిలో ఈ దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేశాడో వ్యక్తి.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

శ్రీదేవి అనే మహిళ తన దగ్గర అప్పు తీసుకుందని, తిరిగి ఇవ్వమంటే జాప్యం చేస్తోందని నిందితుడు నవతన్‌ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడట. శ్రీదేవిపై కత్తి దాడి స్థానికంగా కలకలం సృష్టించగా.. ఘటనపై నవతన్‌పై కేసు నమోదు చేశారు చంచుపల్లి పోలీసులు. ఈలోపే నవతన్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement