కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా Vodafone Idea plans to clear about Rs 2,400 cr dues by September 2023 | Sakshi
Sakshi News home page

కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా

Published Wed, Aug 23 2023 6:25 AM | Last Updated on Wed, Aug 23 2023 6:25 AM

Vodafone Idea plans to clear about Rs 2,400 cr dues by September 2023 - Sakshi

న్యూఢిల్లీ: రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా .. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీల కింద సెప్టెంబర్‌ కల్లా కేంద్రానికి రూ. 2,400 కోట్ల మొత్తాన్ని చెల్లించే యోచనలో ఉంది. 

గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌నకు సంబంధించి కంపెనీ .. జూలై నాటికి లైసెన్సు ఫీజు కింద రూ. 770 కోట్లు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీల కింద రూ. 1,680 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వొడాఫోన్‌ ఐడియా 30 రోజుల వ్యవధి కోరింది. ఈ నేపథ్యంలో సకాలంలో కట్టకపోవడం వల్ల 15 శాతం వడ్డీ రేటుతో బాకీ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement