![Today Gold And Silver Price 21 March 2024 - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/03/21/gold-price-today_0.jpg.webp?itok=QTTDMoGt)
గత కొన్ని రోజులుగా స్వల్ప పెరుగుదల నమోదు చేస్తున్న బంగారం ధరలు ఈ రోజు (గురువారం) తారా స్థాయికి చేరాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.61950 (22 క్యారెట్స్), రూ.67570 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 1000, రూ. 1090 వరకు పెరిగింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగా ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 61950 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 67570 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు రకంగా రూ. 1000 నుంచి రూ. 1090 వరకు పెరిగింది.
చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 950 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1040 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 62350 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 68020 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఏకంగా రూ. 1500 పెరిగింది. దీంతో కేజీ వెండి ఈ రోజు (మార్చి 21) రూ. 78500లకు చేరింది. ఢిల్లీ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విజయవాడలలో కూడా వెండి ధర రూ. 1500 పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment