లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..నిఫ్టీ@24,292 | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..నిఫ్టీ@24,292

Published Wed, Jul 3 2024 3:34 PM | Last Updated on Wed, Jul 3 2024 3:34 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 24,292 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 545 పాయింట్లు ఎగబాకి 79,986 వద్ద ముగిసింది. ఈ రోజు ఒకానొక సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 80,074 మార్కు చేరింది.

డెరివేటివ్‌ మార్కెట్‌లో సుమారు 3.5 లక్షల లాంగ్‌ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, కోటక్‌మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

టీసీఎస్‌, టైటాన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement