బుల్‌ ర్యాలీకి బ్రేకులు..నష్టాల్లో ముగిసిన మార్కెట్లు Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

బుల్‌ ర్యాలీకి బ్రేకులు..నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Published Fri, Jun 28 2024 3:33 PM | Last Updated on Fri, Jun 28 2024 3:34 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిసాయి. బ్యాంకింగ్‌ రంగ స్టాక్‌లు నష్టపోవడంతో ఆ ప్రభావం మార్కెట్‌ సూచీలపై పడింది. మదుపరులు గరిష్ఠాల వద్ద లాభాలు స్వీకరించారు. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 24,004 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 210 పాయింట్లు దిగజారి 79,032 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీసుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement