గరిష్ఠాల్లో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌@78,550 Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

గరిష్ఠాల్లో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌@78,550

Published Wed, Jun 26 2024 3:31 PM | Last Updated on Wed, Jun 26 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు ఆల్‌టైమ్‌హైలో దూసుకుపోతున్నాయి. బుధవారం బ్యాంకింగ్‌ రంగ స్టాక్‌లు భారీగా పెరగడంతో మార్కెట్‌ సూచీలు లాభాల్లోకి జీవితకాల గరిష్ఠాలను చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 23,841 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 518 పాయింట్లు ఎగబాకి 78,572 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయర్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, ఐటీసీ, టీసీఎస్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement