ఎన్ఎ‌స్‌ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ.. | Sebi rejects NSE proposal to extend trading hours for index derivatives | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌ వేళల పెంపునకు నో చెప్పిన సెబీ

Published Wed, May 8 2024 8:48 AM | Last Updated on Wed, May 8 2024 11:28 AM

Sebi rejects NSE proposal to extend trading hours for index derivatives

ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్‌ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్‌ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్‌ఎస్‌ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్‌ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.

ఇదీ  చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్‌!

ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్‌ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్‌ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్‌ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్‌ఎస్‌ఈ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ పేర్కొన్నారు. తదుపరి స్టాక్‌ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement