భారత్‌ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్‌ | Indias Economy Unlikely To Be Impacted By Potential Oil Price Hike, See Details Inside - Sakshi
Sakshi News home page

భారత్‌ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్‌

Published Sat, Dec 30 2023 5:43 AM | Last Updated on Sat, Dec 30 2023 10:28 AM

Indias Economy Unlikely to be Impacted by Potential Oil Price Hike - Sakshi

ముంబై: అంతర్జాతీయ కారణాలతో చమురు ధరల్లో పెరుగుదలసహా ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి) భారత్‌ ఎకానమీపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ వీ అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు.

ఆర్‌బీఐ అంచనాల ప్రకారం, 7 శాతం వృద్ధి ఖాయమని అభిప్రాయపడ్డారు.  ఎస్‌బీఐ నిర్వహించిన ఒక ఎకనమిక్‌ కన్‌క్లేవ్‌లో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్ల తగ్గుదలకు ముందు ఆర్థిక క్రియాశీలత నెమ్మదిస్తుందన్నది తన అభిప్రాయమని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement