పది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి | - | Sakshi
Sakshi News home page

పది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

Published Tue, Apr 23 2024 8:40 AM | Last Updated on Tue, Apr 23 2024 8:40 AM

- - Sakshi

రాయచోటి: పదో తరగతి ఫలితాల్లో అన్నమయ్య జిల్లాలో బాలికలు పై చేయి సాధించారు. మొత్తం 22,240 మంది విద్యార్థులకు గాను 19,276 మంది ఉత్తీర్ణత సాధించారు. 86.67 శాతంతో 17వ స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం రాష్ట్ర ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లోనూ బాలుర (83.65 శాతం) కంటే బాలికలు (89.71) శాతం అంటే 6 శాతం మంది ఎక్కువగా ఉత్తీర్ణులై అమ్మాయిలు శభాష్‌ అనిపించుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాలల చివరి పని దినానికి ముందు రోజున పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం విశేషం. జిల్లాలో 491 పాఠశాలలకు సంబంధించి 22,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కాని 22,240 మంది మాత్రమే హాజరు కాగా వారిలో 19,276 మంది పాసయ్యారు. 304 ప్రభుత్వ పాఠశాలల నుంచి 15,517 మంది విద్యార్థులకు గాను 15,314 మంది పరీక్షలు రాశారు. వీరిలో 12,566 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 187 ప్రైవేటు పాఠశాలల నుంచి 6947 మంది విద్యార్థులకు గాను 6926 మంది హాజరు కాగా 6710 మంది పాసయ్యారు. మొత్తం మీద జిల్లాలో 19276 మంది ఉత్తీర్ణత సాధించారు.

పాఠశాలల వారీగా సాధించిన శాతం..

జిల్లాలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలు 80 శాతం, మోడల్‌ స్కూల్స్‌ 91 శాతం, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 98 శాతం, బి.సి. వెల్ఫేర్‌ స్కూల్స్‌ 99.5 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 68.66 శాతం, కె.జి.బి.వి పాఠశాలలు 85.5 శాతం, మునిసిపల్‌ పాఠశాలలు 83 శాతం, ప్రైవేటు పాఠశాలలు 96.9 శాతం, సోషియల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు 92.6 శాతం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు 84 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ శివప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

టెన్త్‌లో 86.67 శాతం ఉత్తీర్ణత

రాష్ట్రంలో అన్నమయ్యకు 17వ స్థానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement