ట్యాబ్‌ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ | Scientific training on the use of tabs | Sakshi
Sakshi News home page

ట్యాబ్‌ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ

Published Thu, Aug 31 2023 4:09 AM | Last Updated on Thu, Aug 31 2023 4:00 PM

Scientific training on the use of tabs - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తర­గతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యా­బ్‌­ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారి­ంచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పాఠ­శా­ల­ల ను విద్యాశాఖ ఐటీ బృందం స్వయంగా పరి­శీలించి ట్యాబ్‌ల పనితీరును పరీక్షిస్తోంది. విద్యా­ర్థులకు గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌­లను బైజూస్‌ కంటెంట్‌తో పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి 10 రోజుల పాటు అ న్ని పాఠశాలల్లోనూ ఈ బృందం అన్ని ట్యాబ్‌­లను పరిశీలిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఐటీ నోడల్‌ ఆఫీ సర్‌ సీహెచ్‌ రమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో బృందం ఈ ప్రక్రియను ప్రారంభించింది.

మండలానికి ఇ ద్దరు ఐటీ నేపథ్యం ఉన్న ఉపాధ్యాయుల చొప్పున 1,360 మందితో పాటు జిల్లా నోడల్‌ ఆఫీ­సర్లు కూ డా ఇందులో పాలుపంచుకుంటు­న్నారు. తొలుత సాంకేతిక సమస్యలపై దృష్టిపెట్టనున్నారు. సమస్య­లను పరిష్కరించడంతో­పాటు వాటి వినియోగంపై విద్యార్థులు, ఉపాధ్యా­యులకు శిక్షణ తరగతులు ని ర్వ­హిస్తున్నారు. వాస్త­వా­నికి ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్‌ తప్ప ఇంటర్‌నెట్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేసేందుకు, డౌన్‌లోడ్‌ చేసేందుకు అవకాశం లేకుండా ట్యాబ్‌ల సాఫ్ట్‌వేర్‌ రూపొ­ం­దించారు.

సరైన అవ­గా­హన లేక కొందరు విద్యా­ర్థులు యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసేందుకు యత్నించడంతో అవి సాంకేతికంగా ని­లి­­చి­పోతున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందీ విద్యా­ర్థులు గుర్తించలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర­వు­తు­న్నాయి. వీటిన్నింటికి పరి­ష్కా­రంగా విద్యా­శాఖ ఐటీ బృందం ఇప్పుడు అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్‌ అథెంటికేటర్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేస్తోంది. 

డౌన్‌లోడ్‌కు యత్నిస్తే హెచ్‌ఎంకు మెసేజ్‌ 
విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల్లో ఎలాంటి మా ర్పు­­లు చేసినా వెంటనే ఉన్నత స్థాయిలోని వారికి ఓటీపీ మెసేజ్‌ వచ్చేలా ఐటీ బృందం చర్యలు తీ సుకుంటోంది. అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్‌ అథెంటి కేటర్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా విద్యార్థి ట్యాబ్‌­లో మార్పులు చేసేందుకు యత్నిస్తే వెంటనే సంబంధిత స్కూలు హెచ్‌ఎంకు, రాష్ట్ర స్థాయిలోని కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బందికి, మండల స్థాయిలో ఐటీ సహాయ­కులుగా పనిచేసే ఉపాధ్యాయులకు సైతం సమాచా­రం వెళ్తుంది. దీంతో ఏ పాఠశాలలో ఏ విద్యార్థి తప్పు­­చేశారో సులభంగా తెలిసిపోతుంది.

ప్రసుత్తం ఉన్న ట్యాబ్‌లను సరైన రీతిలో విని యోగించకపోవ­డమే తప్ప.. వాటిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని స్టేట్‌ ఐటీ నోడల్‌ అధికారి రమేశ్‌ కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఆ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఏర్పాట్లు చేశామ న్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సచి వాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌కు ట్యాబ్‌ల వినియో గంపై శాస్త్రీయ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement