బ్రహ్మోత్సవాలకు వేళాయే.. | Mahashivratri Brahmotsavam to be organized for 11 days in Srisailam | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు వేళాయే..

Published Fri, Mar 1 2024 5:38 AM | Last Updated on Fri, Mar 1 2024 5:57 AM

Mahashivratri Brahmotsavam to be organized for 11 days in Srisailam - Sakshi

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో నేడు అంకురార్పణ

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. ఉదయం 8:10 గంటలకు యా­గశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామి­కి విశేష అర్చనలు, భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు భేరిపూజ, భేరీ­తాడనం, సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహ­ణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహిస్తారు.

కాగా, బ్రహ్మో­త్సవాల సందర్భంగా మార్చి 2న భృంగి వాహనసేవ, 3న హంస వాహన సేవ, 4న మయూర వాహన సేవ, 5న రావణ వాహన సేవ, 6న పుష్పపల్లకిసేవ, 7న గజ వాహన సేవ, 8న ప్ర¿ోత్సవం, నందివాహన సేవ, అదే రోజు రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రా­భిõÙకం, పాగాలంకరణ, కల్యాణోత్స­వం నిర్వహిస్తారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం, 10న బ్రహ్మోత్సవాలకు పూర్ణా­హుతి చేపట్టి సాయంత్రం ధ్వజావరోహణ చేస్తారు. 11న అశ్వ వాహనసేవ, పుషో్ప­త్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.
 
నేడు పట్టు వస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారిచే స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. అలాగే, 2న ద్వారక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, 3న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, 4న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానాలు పట్టువస్త్రాలను సమర్పి0చనున్నాయి. 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమర్పిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement