తిరుపతి: ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి Elephant Died In SV Zoo Park Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతి: ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి

Published Wed, Nov 8 2023 9:38 AM | Last Updated on Wed, Nov 8 2023 10:18 AM

Elephant Died In SV Zoo Park Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతిచెందింది. చిత్తూరు జిల్లా మాదమరి మండలంలో పంటపొలాల విధ్వంసంలో ఏనుగుకు గాయాలవ్వగా అటవీశాఖ సిబ్బంది జూపార్క్‌కు తరలించారు. అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగుకి గాయాలు కావడంతో జూపార్క్‌లో చికిత్స అందించారు. 

చికిత్స పొందుతూ ఎ‍స్వీ జూపార్కులో మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఏనుగు కళేబరానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరోవైపు సదుం మండలం గంటా వారి పల్లి పంట పొలాలలో విద్యుత్ షాక్‌ తగిలి మరో ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement