ఏపీలో పెట్రోల్‌ బంకులకు ఈసీ సీరియస్‌ వార్నింగ్‌ EC Bans Sale of Loose Petrol, Diesel in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో పెట్రోల్‌ బంకులకు ఈసీ సీరియస్‌ వార్నింగ్‌

Published Sun, May 19 2024 8:01 AM | Last Updated on Sun, May 19 2024 11:20 AM

EC Bans Sale of Loose Petrol, Diesel in AP

రాష్ట్రంలోని పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులకు ఈసీ ఆదేశాలు
 

సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల  సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్‌షిప్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ మేరకు అన్ని పెట్రో డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్ని­కల సంఘం జారీ చేసింది. పెట్రోల్‌ బంకులపై నిరంతరం ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాకుండా గొడవలు చేసే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది.   

ఈ ఆదేశాల మేరకు ఏపీ పెట్రో డీలర్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ రావి గోపాలకృష్ణ కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలను కఠి­నంగా అమలు చేయాలని డీలర్లకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement