కరోనా బాధితురాలికి 108లో ప్రసవం  | Corona victim gave birth in 108 Vehicle | Sakshi
Sakshi News home page

కరోనా బాధితురాలికి 108లో ప్రసవం 

Published Sun, Aug 9 2020 5:32 AM | Last Updated on Sun, Aug 9 2020 5:32 AM

Corona victim gave birth in 108 Vehicle - Sakshi

బనగానపల్లె రూరల్‌: కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ గర్భిణి 108లోనే ప్రసవించింది. అంబులెన్స్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ) కిరణి చొరవ తీసుకుని ఆమెకు సుఖప్రసవం చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం అలమూరుకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో బనగానపల్లె కమ్యూనిటీ వైద్యశాలకు తెచ్చారు. ఆమెకు రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది.

ఈ విషయం తెలుసుకున్న కమ్యూనిటీ వైద్యశాల సిబ్బంది ఆమెకు ఇక్కడ ప్రసవం చేయడం కష్టమని, వెంటనే 108లో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. 108 వాహనంలో ఎక్కించాక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను బనగానపల్లె వైద్యశాలలో చేర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement