ఏపీలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది | The Center is committed to the development of railways in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

Published Sun, Dec 10 2023 5:44 AM | Last Updated on Sun, Dec 10 2023 2:40 PM

The Center is committed to the development of railways in AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం/సింహాచలం/సాక్షి ప్రతినిధి విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభి­వృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే బడ్జెట్‌లో ఇప్పటివరకూ ఏపీకి రూ.8,406 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం ఉదయం విశాఖ చేరుకున్న ఆయన సింహాచలం స్టేషన్‌ని సందర్శించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా రూ.20 కోట్లతో జరుగు­తున్న స్టేషన్‌ అభివృద్ధి పనుల్ని బీజేపీ నేతలతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మా­ట్లాడుతూ.. విశాఖ రైల్వే­స్టేషన్‌కు శాటిలైట్‌ స్టేషన్‌గా సింహాచలంను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వడి­వడిగా అడుగులు వేస్తోందనీ.. ఇప్పటికే రూ.106 కోట్లు జోన్‌ నిర్మాణానికి కేటా­యించామని ఆయన గుర్తుచేశారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్, సీఎస్, స్పెషల్‌ సీఎస్‌తో ఎప్పటి­కప్పు­డు సంప్రదింపులు జరుపు­తున్నామని.. త్వరగా సమç­Ü్యని పరిష్క­రించి.. జోన్‌ నిర్మాణ కార్యకలా­పాలు ప్రారంభించేందుకు సిద్ధమ­వు­తున్నామని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

ఇక ఉత్తరాంధ్రలోని 72 రైల్వేస్టేషన్లలో 15 స్టేషన్లని ఎంపిక చేసి ప్రపంచస్థాయి స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వర­లోనే మరిన్ని వందే­భారత్‌ సర్వీసులు పట్టా­లెక్క­నున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా కంకటాపల్లి రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మరోవైపు.. దేశంలో 5జీ మొబైల్‌ సర్వీసులు విస్త­రిం­చే ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంద­న్నారు. ఈ కార్య­క్రమంలో ఎంపీ జీవీఎల్, వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్పన్నను దర్శించుకున్న మంత్రి..
అంతకుముందు.. కేంద్రమంత్రి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కేకే మార్గంలో డబుల్‌ లైన్‌
ఇక అరకు వెళ్లే కొత్తవలస–కిరండూల్‌ (కేకే) రైలు మార్గంలో రెండో లైన్‌ వేయడానికి ఏర్పాట్లు­చేస్తు­న్నట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో భాగంగా శని­వారం ఆయన విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలువర్తిలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ పరిపాలనా విధానాలు బాగున్నాయని ప్రశంసించారు. కేంద్ర నుంచి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రధాని మోదీ సందేశాన్ని లైవ్‌లో నాయకులు, ప్రజలు తిలకించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement