సహజ వెలుగులను ఇలా కొనండి | APERC Announces Renewable Energy Procurement Rules | Sakshi
Sakshi News home page

సహజ వెలుగులను ఇలా కొనండి

Published Fri, Sep 30 2022 5:53 AM | Last Updated on Fri, Sep 30 2022 12:48 PM

APERC Announces Renewable Energy Procurement Rules - Sakshi

సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్‌ విడుదల చేసింది.

ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్‌ సంస్థలు వినియోగించే విద్యుత్‌లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్‌ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్‌ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్‌ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement