రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ | AP DGP Said Legal Action Against Those Who Provocative Comments | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ

Published Tue, Oct 19 2021 8:00 PM | Last Updated on Tue, Oct 19 2021 8:33 PM

AP DGP Said Legal Action Against Those Who Provocative Comments - Sakshi

సాక్షి, విజయవాడ: రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావొద్దని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామని, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ సహకరించాలన్నారు.
చదవండి: మంగళగిరిలో సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ గూండాల దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement