-
జొమాటో కొత్త అవతారం.. ఆర్బీఐ అనుమతి!
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో (Zomato) అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ని మంజూరు చేసింది. దీంతో తన ప్లాట్ఫామ్ ద్వారా ఈ-కామర్స్ లావాదేవీల నిర్వహణకు జొమాటోకు అనుమతి లభించింది. దేశంలో పేమెంట్స్ అగ్రిగేటర్గా పనిచేయడానికి జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ZPPL)కు 2024 జనవరి 24న రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం మంజూరైంద అని ఫుడ్టెక్ సంస్థ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. జొమాటోతోపాటు టాటా పే, రేజర్పే, క్యాష్ఫ్రీ సంస్థలకు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ లైసెన్స్ మంజూరైంది. జొమాటో గత సంవత్సరం ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి తన సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంది. లావాదేవీలను సులభతరం చేయడానికి గూగుల్పే, ఫోన్పే, పేటీఎం వంటి ఇతర చెల్లింపు యాప్లపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. దీంతో థర్డ్-పార్టీ యాప్ల ద్వారా చేసే చెల్లింపులతో వచ్చే మర్చెంట్ ఛార్జీలు ఆదా అవుతాయి. కాగా గతంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లను అందించడం కోసం RBL బ్యాంక్తో కూడా జొమాటో జతకట్టింది. అయితే గత ఏడాది మేలో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. -
విదేశాల్లో దుకాణం బంద్! ఆస్తులు అమ్మేస్తున్న జొమాటో..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో విదేశాల్లో తమ ఉనికిని క్రమంగా తగ్గించుకుంటోంది. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆస్తులు అమ్మేస్తోంది. జొమాటో వియత్నాం కంపెనీ లిమిటెడ్, పోలాండ్కు చెందిన గ్యాస్ట్రోనౌసీ వంటి అనుబంధ సంస్థలను లిక్విడేట్ చేస్తున్నట్లు జొమాటో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వియత్నాం, పోలాండ్లోని తన స్టెప్-డౌన్ అనుబంధ సంస్థల కోసం ఖర్చు తగ్గించే చర్యగా రద్దు ప్రక్రియను ప్రారంభించినట్లు జొమాటో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్లో తెలియజేసింది. గురుగ్రామ్ ఆధారిత ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 2023 మార్చి నుంచి పది అనుబంధ సంస్థలను రద్దు చేసింది. 2023 సంవత్సరంలో జొమాటో చిలీ ఎస్పీఏ, పీటీ జొమాటో మీడియా ఇండోనేషియా (PTZMI), జొమాటో న్యూజిలాండ్ మీడియా ప్రైవేటు లిమిటెడ్, జొమాటో ఆస్ట్రేలియా, జొమాటో మీడియా పోర్చుగల్ యూనిపెస్సోల్ ఎల్డీఏ, జొమాటో ఐర్లాండ్ లిమిటెడ్ – జోర్డాన్, చెక్ రిపబ్లిక్ లంచ్టైమ్, జొమాటో స్లొవేకియా వంటి వివిధ సంస్థలకు జొమాటో వీడ్కోలు పలికింది. అలాగే కెనడా, యూఎస్, ఫిలిప్పీన్స్, యూకే, ఖతార్, లెబనాన్, సింగపూర్లలోనూ జొమాటో తన అకార్యకలాపాలను నిలిపివేసింది. ఇలా అనేక దేశాల నుంచి వైదొలిగినప్పటికీ ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈలలో మాత్రం యాక్టివ్గానే ఉంది. 16 ప్రత్యక్ష అనుబంధ సంస్థలు, 12 స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలు, జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింకిట్ కామర్స్, జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఒక అనుబంధ కంపెనీలను జొమాటో తన 2023 వార్షిక నివేదికలో పేర్కొంది. -
రూ.97 లక్షల టిప్స్ - సీఈఓ రియాక్షన్ ఇలా..
2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే రైడ్! దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 -
పెట్రోల్ తిప్పలు..గుర్రం మీద ఫుడ్ డెలివరీ
-
Zomato: ఛార్జీలు ఎందుకు పెంచుతుందో తెలుసా..?
గత త్రైమాసిక ఫలితాల్లో క్రమంగా నష్టాలు పోస్ట్ చేసిన జొమాటో ఇటీవల కొంత లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సేవలందించే సంస్థలు వాటి అవసరాలకు తగినట్లు ఛార్జీలు పెంచుకునే వీలుంది. నూతన సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో.. ప్లాట్ఫారమ్ ఛార్జీని రూ.3 నుంచి రూ.4కి పెంచింది. కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్లలో ఆర్డర్కు రూ.9 వరకు పెంచింది. మార్జిన్లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ.2 ప్లాట్ఫారమ్ ఛార్జీను ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని రూ.3కు పెంచింది. జనవరి 1న దాన్ని మళ్లీ రూ.4కు తీసుకొచ్చింది. ఇదీ చదవండి: న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే? కొత్త ప్లాట్ఫారమ్ ఛార్జీ ‘జొమాటో గోల్డ్’తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్లు పొందినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జొమాటోకు దిల్లీ, కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ.4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి. పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని సంస్థ పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ సంస్థ నోటీసులు అందుకుంది. -
అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి
హైదరాబాద్:నగరంలో మంగళవారం పెట్రోలు కొరత కారణంగా...ఓ జొమాటో డెలివరీ బాయ్ ఏకంగా గుర్రాన్ని అద్దెకు తీసుకుని ఫుడ్ డెలివరీ చేశాడు. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రోజుమాదిరిగానే జొమాటోలో ఆర్డర్లు స్వీకరించగా..బైకులో పెట్రోల్ అయిపోయింది. బంకులు మూతపడడంతో సమీపంలోని ఓ వ్యక్తి వద్ద రూ.500 అద్దెకు ఓ అశ్వాన్ని తీసుకుని ఆర్డర్లు డెలివరీ చేశాడు. సైదాబాద్లోని ఇంపీరియల్ హోటల్లో పార్శిల్ తీసుకుని చంచల్గూడలో కస్టమర్కు అందించేందుకు వెళ్తుండగా ‘సాక్షి’ ప్రతినిధి పలకరించగా..పై విషయాలు వెల్లడించాడు. #Zomato Agent Delivers Food On Horse after the pumps ran out of petrol#TruckDriversProtest #HitandRunLaw #petrolpump pic.twitter.com/wqbfbAqaUo — rajni singh (@imrajni_singh) January 3, 2024 -
న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే?
2024 కొత్త సంవత్సరంలో జొమాటో, స్విగ్గీ, ఓయో వంటి సంస్థలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31న ఒకే రోజు అత్యధిక ఆర్డర్స్ చేసినట్లు జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జొమాటో - 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జొమాటో డెలివరీ బాయ్స్ ఆ ఒక్క రోజులో పొందిన మొత్తం టిప్స్ ఏకంగా రూ. 97 లక్షలు కావడం గమనార్హం. Fun fact: We’ve delivered almost as many orders on NYE 23 as we did on NYE 15, 16, 17, 18, 19, 20 combined 🤯 Excited about the future! — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 స్విగ్గీ - స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలను ఆర్డర్ చేశారు. 200 ప్యాకెట్ల సింగిల్ కెచప్ను సూరత్లో డెలివరీ చేశారు. సుమారు 1.04 లక్షల మంది ప్రజలు ఫుడ్ డెలివరీ చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. గతంలో పోలిస్తే ఈ సేల్స్ చాలా ఎక్కువని చెబుతున్నారు. బిర్యానీ - న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లోనే మొత్తం 4.8 లక్షల బిర్యానీలు డెలివరీ అయ్యాయని చెబుతున్నారు. అంటే ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్స్ బిర్యానీ కోసం వచ్చినట్లు సమాచారం. ఓయో రూమ్ బుకింగ్స్ - న్యూ ఇయర్ సందర్భంగా ఫుడ్ మాత్రమే కాకుండా ఓయో రూమ్స్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయికి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి 37 శాతం లేదా 6.2 లక్షల బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 30, 31 వ తేదీల్లో మాత్రమే 2.3 లక్షల రూమ్స్ బుక్ అయ్యాయని, ఇందులో కూడా ఎక్కువగా అయోధ్యలో ఎక్కువగా 70 శాతం, తరువాత స్థానాల్లో గోవాలో 50 శాతం అని తెలుస్తోంది. this year the numbers are almost 4 times higher. with 2,00,000 kilos of kaanda and 1,80,000 kilos of aloo stocked at @swiggyinstamart, uday shetty is spinning and shaking unable to control himself rn https://t.co/cVOmsKZf1n — Swiggy (@Swiggy) December 31, 2023 -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్వర్కర్స్ అసోసియేషన్కు చెందిన డెలివరీబాయ్లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
జొమాటోకి గట్టి షాక్.. ఆ చార్జీలపైనా జీఎస్టీ కట్టాల్సిందే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) షాకిచ్చింది. రూ.401.7 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించనందుకు డీజీజీఐ తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకి పన్ను నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలు వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలు సేవల కేటగిరీ కిందకు వస్తాయని, వీటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. పెనాల్టీలు, వడ్డీ కూడా.. జీఎస్టీ బకాయిలతోపాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్ను చెల్లించలేకపోవడంపై 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరిమానాలు, వడ్డీని కూడా చెల్లించాలని జొమాటోను డీజీజీఐ ఆదేశించింది. జొమాటో స్పందన డీజీజీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జొమాటో స్పందించింది. తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. "డెలివరీ ఛార్జ్ని డెలివరీ భాగస్వాముల తరపున కంపెనీ వసూలు చేస్తుంది. కానీ కంపెనీ నేరుగా డెలివరీ సర్వీసులు అందించదు. కాంట్రాక్టు నిబంధనలు, షరతుల మేరకు డెలివరీ భాగస్వాములు కస్టమర్లకు డెలివరీ సేవలు అందిస్తారు." అని పేర్కొంది. లీగల్, ట్యాక్స్ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని షోకాజ్కు నోటీసుకు తగినవిధంగా స్పందన సమర్పిస్తామని ప్రకటనలో పేర్కొంది. -
Zomato Orders 2023: వీళ్లు తిన్న నూడిల్స్తో భూమిని 22 సార్లు చుట్టిరావొచ్చు!
పాతొక రోత.. కొత్తొక వింత. పాశ్యాత్య సంస్కృతుల్ని, ఆహార సంప్రదాయాల్ని మనవాళ్లు ఇష్టపడుతుండడం కొత్త కాకపోవచ్చు. ఇప్పటికే వస్త్రధారణలో వెస్ట్రన్ కల్చర్ను దాటేసి పోయారు. తినే తిండిలోనూ అదే ధోరణిని కనబరుస్తున్నారు. సాక్ష్యం ఏంటంటారా?.. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అందుకు సమాధానాలు ఇస్తోంది. 2023 మరికొన్నిరోజుల్లో ముగియనున్న తరుణంలో ఆయా ఫుడ్ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్ ఐటమ్ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. 2023లో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. ►తన ప్లాట్ఫామ్ మీద 10.09 కోట్ల బిర్యానీల కోసం ఆర్డర్ పెట్టుకుంటే, రెండో స్థానంలో ఉన్న పిజ్జాను 7.45 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో తెలిపింది. ►తద్వారా ఈ ఏడాదిలో పెట్టిన బిర్యానీ ఆర్డర్లతో ఢిల్లీలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను, కోల్కతాలో ఉన్న ఐదు కంటే ఎక్కువ ఈడెన్ గార్డెన్ స్టేడియంలతో సమానమైన పిజ్జాలను ఫుడ్ లవర్స్ ఆర్డర్ పెట్టినట్లు పేర్కొంది. ► మూడవ స్థానంలో 4.55 కోట్ల నూడిల్స్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ లవర్స్ పెట్టిన ఆ నూడిల్స్ ఆర్డర్తో భూమిని 22 సార్లు చుట్టడానికి ఇది సరిపోతుందని డెలివరీ దిగ్గజం వెల్లడించింది. ►స్విగ్గీలో ఎక్కువగా కేక్లు ఆర్డర్ రావడంతో బెంగళూరు కేక్ కేపిటల్గా అవతరించింది. ఫుడ్ లవర్స్ ఈ ఏడాది అత్యధికంగా జొమాటోలో బ్రేక్ ఫాస్ట్ను ఆర్డర్ పెట్టుకోగా, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఎక్కువ మంది అర్ధరాత్రి ఆర్డర్ చేసుకున్నారు. ►జొమాటోకి ఈ ఏడాదిలో అత్యధికంగా బెంగళూరు నుంచి ఫుడ్ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఆర్డర్ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్ ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్లు పెట్టారు. నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో ముంబై నిలిచింది. ఈ ప్రాంతం నుంచి ఏడాది మొత్తం వరకు 3,580 ఆర్డర్లు రాగా.. రోజుకి కనీసం 9 ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో హైలెట్ చేసింది. బిర్యానీకి తిరుగులేదు వరుసగా 8వ సంవత్సరం సైతం స్విగ్గీలో ఎక్కువ బిర్యానీ ఆర్డర్ పెట్టినట్లు ఆ సంస్థ తన ఇయర్ ఎండర్ 2023 రిపోర్ట్లో తెలిపింది. ప్రతి సెకనుకు 2.5 బిర్యానీ ప్యాకెట్ల ఆర్డర్ ఇక దేశీయంగా ఉన్న ఫుడ్ లవర్స్ ప్రతి సెకండ్కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ పెట్టారు. వారిలో హైదరాబాద్కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్లో ప్రతి 6వ ఆర్డర్ ఇక్కడే నుంచే రావడం గమనార్హం. 2023లో ముంబైకి చెందిన ఓ ఫుడ్ లవర్స్ రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
ఇకపై కేటరింగ్ చేయనున్న ఫుడ్ డెలివరీ సంస్థ..?
ఫుడ్ డెలివరీ చేసే టెక్ సంస్థ జొమాటో భారీ ఆర్డర్లను అందించే విస్తృత వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగా జొమాటో కేటరింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫుడ్ డెలివరీతోపాటు ప్రస్తుత రెస్టారెంట్ భాగస్వాముల నెట్వర్క్ను ఉపయోగించి కేటరింగ్ సర్వీస్లను అందించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో నిత్యం ఉద్యోగాలు, ఇతర పనులతో బిజీగా ఉంటున్న ప్రజలు.. ఖాళీ దొరికితే బయటకెళ్లి సమయం గడపాలనుకుంటున్నాయి. ఒంటరిగా కంటే ఉమ్మడిగా, స్నేహితులతో కలిసి సమయం గడుపుతుంటారు. దాంతో వారందరికీ ఫుడ్ ఆర్డర్ చేయడం కొంత కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అలాంటి వారి అవసరాలు తీర్చేలా జొమాటో కేటరింగ్ సర్వీస్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..? ఒకేసారి వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడానికి మల్టీ కార్ట్ ఫీచర్ను ఈ ఏడాది జూన్లో జొమాటో లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో తాజా స్ట్రాటజీతో మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. చిన్న సైజ్ ఆర్డర్లు పెట్టే వారిని ఆకర్షించేందుకు జొమాటో ఈ ఏడాది ‘ఎవ్రిడే’ను లాంచ్ చేసింది. -
‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: ఎడిల్విస్ సీఈఓ
మనం చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీర్చే సాధనంగా మారుతుంది. పొదుపు చేయకపోతే జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ క్రమశిక్షణతో దాన్ని నిజంగా అనుసరిస్తూ ప్రతినెల కొంత మదుపుచేసే వారు చాలా తక్కువగా ఉంటారు. కొన్నేళ్ల కిందట ఎంతోమంది రోజువారీ సంపాదిస్తున్న కొద్దిమొత్తంలోనే ఖర్చు చేసి తోచినంత పొదుపు చేసేవారు. కానీ ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్భాటాలకుపోయి ఉన్నదంతా ఖర్చుచేసి నెలాఖరుకు చేతిలో డబ్బులేక తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ‘ఒకప్పటి తరం బతకడానికి చాలా కష్టపడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయాలు పెరిగాయి. ఇప్పటి తరానికి ఆదాయానికి కొదవ లేదు. కానీ వారిలో పొదుపు చేయాలన్న భావన కనిపించడం లేదు’అని ఎడిల్విస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటో, నెట్ఫ్లిక్స్తోనే పోటీ అంటున్నారు. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థకు అధినేత ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం. బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్పాండే ‘ది బార్బర్షాప్ విత్ శంతను’ పేరుతో ఒక పాడ్కాస్ట్ను నిర్వహిస్తున్నారు. ఇటీవల అందులో రాధికా గుప్తా మాట్లాడారు. యువతకు డబ్బు పొదుపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ స్విగ్గీ, జొమాటో, నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీలతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? ‘నెలకు రూ.50వేలు-రూ.60 వేలు సంపాదిస్తున్నవారు అందులో నెలనెలా ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా మంది సరిపడా సంపాదించలేకపోతున్నారు. సంపాదిస్తున్న దానిలో కనీసం రూ.100 క్రమానుగత పెట్టుబడిలో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నామని చాలామంది చెప్తారు. కానీ వారు నెట్ఫ్లిక్స్ కోసం నెలకు రూ.100 కడుతుంటారు. దేశంలో ఓటీటీ ప్లాట్ఫాంలతోపాటు స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో కేవలం 4 కోట్ల మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. ఆ 40 కోట్ల మంది నిత్యం చేస్తున్న ఖర్చులో కొంత మదుపు చేస్తే భవిష్యత్తులో వారి తర్వాతి తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే మా పోటీ’ అని రాధికా గుప్తా అన్నారు. -
‘ఇదే మంచి సమయం’.. జొమాటోలోని వాటా అమ్మనున్న అలిపే
ప్రముఖ చైనా పేమెంట్ దిగ్గజం అలిపే కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఉన్న తన వాటాను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జొమాటోలో అలిపేకి మొత్తం 3.44 శాతం వాటా ఉంది. అందులో 3.4 శాతం వాటాను ఇండియన్ స్టాక్ మార్క్ట్లోని బ్లాక్ డీల్ (5లక్షల షేర్లను ఒక్కొకరికి అమ్మే) పద్దతిలో విక్రయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ మొత్తం విలువ 395 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు). జొమాటో - అలిపే మధ్య జరిగే ఈ డీల్లో సలహా ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధుల్ని సలహాదారులుగా నియమించన్నట్లు సమాచారం. అయితే దీనిపై జొమాటో- అలిపేలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాకెట్ వేగంతో జొమాటో 2021 జులై నెలలో ఐపీఓకి వెళ్లింది. ఉక్రెయిన్పై రష్యా వార్తో పాటు ఇతర అనిశ్చితి పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లోని టెక్నాలజీ స్టాక్స్ 2022 మే వరకు నష్టాల్లోనే కొనసాగాయి. భారీ లాభాల్ని ఒడిసిపట్టి మే నెల నుంచి తిరిగి పుంజుకోవడంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 90 శాతం మేర జొమాటో షేర్ల విలువ పెరిగింది. దీంతో భారీ లాభాల్ని అర్జించిన అలిపే మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల్ని అమ్మేందుకు ఇదే మంచి సమయం అని తెలిపింది. అన్నట్లుగానే తాజాగా జొమాటోలోని వాటాను అమ్మేందుకు అలిపే చర్చలు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు
దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్ కాబట్టి దాని ట్యాక్స్స్లాబ్కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ల ప్లాట్ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి. -
అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్లు అంత పెద్దవేమీ కావు, అలా కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు. జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే. అందులో నిజాయితీ లేదు ఈ డిస్కౌంట్ పద్ధతి కస్టమర్లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు. ఇదీ చదవండి: షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్కార్డులు ఇవే.. -
Zomato Jobs: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో ఉద్యోగాల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులను తమ కంపెనీలో ఇకపై ఉద్యోగాలు ఇవ్వబోమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. సంస్థ ఉద్యోగ నియామకం భిన్నమైందని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వమని, ఎలాంటి పనిగురించి వెతకకుండా, నమ్మకంగా పని చేసే స్వభావం ఉన్న వారికే తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జొమాటో ప్రారంభించి 15 ఏళ్లు అయిందన్నారు. సంస్థలో గత 5-6 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీ అవసరాలకు సరిపడా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొత్తవారిని నియమించుకోవాలంటే మాత్రం వారి నైపుణ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘కొత్తవారిని నియమించాలంటే ఇంటర్వ్యూకు మూడు నెలలు సమయం అయిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పాసైతే పాత సంస్థలో మరో మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత సమయం పడుతుంది. అభ్యర్థి పనితనం గురించి తెలియాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మొత్తం దాదాపు 2 ఏళ్లు వృథా అవుతాయి’అని గోయల్ అభిప్రాయపడ్డారు. దానికిబదులుగా సంస్థలోని వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతస్థానంలో నియమిస్తే కంపెనీ విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదని చెప్పారు. -
రూ.16 లక్షల బైకుపై ఫుడ్ డెలివరీ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్ఎస్బీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన 'సుజుకి హయబుసా' (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు. వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్సైకిల్ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by HARPREET SINGH (@hsbofficial) -
ఏడాదిలో 42శాతం పెరిగిన కంపెనీ ఇదీ..
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విలువను 7.85 బిలియన్ డాలర్లు (రూ.65,000 కోట్లు)గా అమెరికా ఫండ్ మేనేజర్ ఇన్వెస్కో అంచనా వేసింది. ఈ ఏడాది జులై 31 నాటికి 5.5 బిలియన్ డాలర్లుగా స్విగ్గీ విలువను తేల్చిన ఇన్వెస్కో ప్రస్తుత విలువను ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత అంచనా విలువ 42 శాతం ఎక్కువ. 2022 జనవరిలో స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే తాజా అంచనా విలువ 30 శాతం తక్కువగానే ఉంది. ఆ సమయంలో ఇన్వెస్కో నేతృత్వంలో జరిగిన 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ప్రక్రియ కోసం, స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్ల విలువగా పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తున్న స్విగ్గీ.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. స్విగ్గీలో ఇన్వెస్కోకు 24,844 షేర్లు ఉన్నాయి. సంస్థ విలువలో మార్సును పరిగణనలోకి తీసుకోమని, వినియోగదార్ల సేవలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్విగ్గీ చెబుతోంది. అయితే స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో విలువను గత జులైలో 7.7 బిలియన్ డాలర్లుగా లెక్కించడం గమనార్హం. ఆ తర్వాత జొమాటో షేరు 30 శాతం పెరగడంతో, ప్రస్తుతం ఆ సంస్థ విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా. -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త!
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణంలో ప్యాసింజర్లు కోరుకున్న ఆహారాన్ని అందించేలా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’తో జత కట్టింది. దీంతో ప్రయాణికులు రైల్వే ప్రయాణంలో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ను ముందే బుక్ చేసుకుంటే నిర్ధేశించిన రైల్వే స్టేషన్లో ఆహారాన్ని అందించనుంది. ప్రస్తుతం, ఈ సౌకర్యం ఐదు స్టేషన్లకే పరిమితం చేసింది. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద ప్రస్తుతం ఢిల్లీతోపాటు ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో జొమాటో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఐఆర్సీటీసీ ప్రత్యేక సర్వీసులు, ఆఫర్లను అందిస్తుంది. ప్రత్యేకించి నవరాత్రోత్సవాల్లో ఉపవాసం ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘థాలీ’ని అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఐఆర్సీటీసీతో ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో జొమాటో షేర్ రూ.115 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి జొమాటో షేర్ రూ.113.20 వద్ద ముగిసింది. ఐఆర్సీటీసీ స్టాక్ రెండు శాతం నష్టాలతో రూ.700 వద్ద ట్రేడయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.48 శాతం నష్టంతో రూ.704 వద్ద స్థిర పడింది. -
బైక్పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!
ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో, సామాజిక్ మాధ్యమాల్లో ఫేమస్కావాలని యువతకు ఎంతో ఆశగా ఉంటుంది. అందుకు ఎన్నో మార్గాలను ఎంచుకుని ప్రయత్నాలు చేస్తారు. అందుకు అనుగునంగా కొందరు అనుకున్న విధంగా సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకుంటారు. అయితే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో పేరును వాడుకొని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, పాపులర్ అయ్యేందుకు వింత ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి జనాల దృష్టిని ఆకర్షించాలని జొమాటో డ్రెస్ కోడ్లో యమహా R15 బైక్తో రోడ్డుపై చక్కర్లు కొట్టిన సంఘటన ఇండోర్లో జరిగింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో జొమాటో పాపులర్ అయింది. అయితే జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వారు ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం ఓ స్టైలిష్ బైక్పై జొమాటో బ్యాగ్, డ్రైస్ ధరించి రోడ్లపై రౌండ్లు వేస్తూ నెట్టింట్లో వైరల్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగినట్లుగా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారడంతో ఇది జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ దృష్టికి వెళ్లింది. ఈ వీడియోకు సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. జొమాటోకు దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. హెల్మెట్ లేని బైక్ రైడింగ్ను తాము ప్రోత్సహించబోమని చెప్పారు. తమకు ఇండోర్లో మార్కెటింగ్ హెడ్ లేరన్నారు. అయితే మహిళలు ఇలా ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా మారడంలో తప్పు లేదని చెప్పారు. View this post on Instagram A post shared by I N D O R E - R E E L G R A M (@indore_reelgram.official) -
పార్శిల్ బిజినెస్లోకి జొమాటో.. ఎవరు వినియోగించుకోవచ్చంటే?
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా జొమాటొ ఎక్స్ ట్రీం పేరుతో కొత్త పార్శిల్ సర్వీసుల్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఎక్స్ట్రీమ్ కింద 3 లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నట్లు తెలిపిన జొమాటో.. ఈ పార్శిల్ సర్వీసుల్ని చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద రీటైల్ షాపుల వరకు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇది ఫుడ్ డెలివరీ తరహాలో వ్యాపారులు తమ సరుకులను ప్రత్యక్షంగా ట్రాక్ చేసుకోవచ్చు. 35 రూపాయలతో ప్రారంభమయ్యే 10 కిలోగ్రాముల బరువున్న ఇంట్రా-సిటీ ప్యాకేజీలను మాత్రమే పంపగలరని జొమాటో వెల్లడించింది. ఇక ఈ ఎక్స్ట్రీమ్ యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయి వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ స్టోర్లో ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. దీనిపై జొమాటో మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
డెలివరీ బాయ్కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
ఆ 3 రోజులు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ సేవలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని ముస్తాబవుతోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న తరుణంలోకేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల విధింపు సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారని కేంద్రం వెల్లడించింది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా జీ 20 సదస్సు నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజధాని నగరంలో పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నగరంలో క్లౌడ్ కిచెన్, డెలివరీ సేవలకు అనుమతిని నిరాకరించారు. జొమాటో, స్విగ్గీ, అమెజాన్ అన్నీ బంద్ సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను నిషేధించారు. వీటితోపాటు బ్లింకిట్, జెప్టో.. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ , ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలను కూడా అనుమతించబోరు. ఎన్డీఎమ్సీ ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ తెలిపారు. ఈ ఆంక్షలు ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అదేవిధంగా ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే.. వాటికి మినహాయింపు అయితే వీటికి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ ఉంటుందని ఆయన తెలిపారు వైద్య సేవలు, పోస్టల్ సేవలు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 8, 9,10 తేదీల్లో ఢిల్లీలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. 9, 10వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. సమ్మిట్ కారణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని దుకాణాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వర్క్ ఫ్రం హోమ్ సెప్టెంబర్ 8 శుక్రవారం ఓజు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండనున్నాయని.. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఆదేశించింది. -
జొమాటో ఏఐ చాట్ బాట్ విడుదల.. ఉపయోగం ఏంటంటే?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ చాట్ బాట్ను విడుదల చేసింది. ఈ చాట్ బాట్ సాయంతో కస్టమర్లకు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో సలహా ఇస్తుంది. జొమాటో ఏఐని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే జొమాటో ఏఐ ప్రత్యేకమైన యాప్ కాదు. కానీ ఇది జొమాటో యాప్లోని చాట్బాట్. యాప్ తాజా అప్డేట్లో అందుబాటులో ఉంటుంది. అయితే జొమాటో గోల్డ్ కస్టమర్లు ప్రత్యేకంగా జొమాటో ఏఐ ఫీచర్లను పొందవచ్చు. జొమాటో ఏఐ ఎలా పనిచేస్తుంది? జొమాటో ఏఐ అనేది కస్టమర్ల అవసరాల్ని తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఫిట్నెస్కు అనుగుణంగా ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుందని మీరు ఏఐని అడిగితే క్లుప్తంగా వివరిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ సైతం డిస్ప్లేలో కనబడతాయి. అంతేకాకుండా,కస్టమర్లకు నచ్చిన వంటకాలను అందించే రెస్టారెంట్ జాబితాలను కూడా అదే చూపుతుంది. జొమాటో లేటెస్ట్ అప్డేట్తో ఏఐ చాట్బాట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. -
జొమాటోలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ తాజాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోలో 1.16 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 10 కోట్ల షేర్ల(1.16 శాతం వాటా)ను అమ్మివేసింది. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ గ్రోత్(సింగపూర్) పీటీఈ షేరుకి రూ. 94.7 సగటు ధరలో రూ. 947 కోట్లకు విక్రయించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏబీ సన్లైఫ్, యాక్సిస్, కొటక్ మహీంద్రాతోపాటు సొసైటీ జనరాలి, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, నోమురా సింగపూర్ తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీ తదుపరి జొమాటోలో సాఫ్ట్బ్యాంక్ వాటా 3.35% నుంచి 2.19 శాతానికి క్షీణించింది. ఈ వార్తలతో జొమాటో షేరు 5.3 శాతం జంప్ చేసి రూ. 100 సమీపంలో ముగిసింది.