YSR Pension Kanuka
-
కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
ముసలవ్వ స్పీచ్ కు దద్దరిల్లిన కాకినాడ
-
పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని.. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నరే. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూపించవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది. ►22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి ►ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ►ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు ►కానీ ఇదే దత్తపుత్రుడు, ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు ►ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసిన వారు వీళ్లే ►అవినీతి పరుడు చంద్రబాబు అని సాక్షాత్తూ కేంద్రానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే, కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకొని చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్లి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు ►ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు ►అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు ►చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి ఎవడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు ►గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని? సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర ►అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ పెన్షన్ గానీ, ఇతర పథకాలుగానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.46 లక్షలు నేరుగా పోతోంది ►ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు ►ప్రతి పేదవాడికీ మంచి జరగాలని ఎందుకుమీ బిడ్డ చేయగలిగాడు. ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు ఆలోచించాలి ►అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువ ►కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మారాడు ►అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు 2.46 లక్షల కోట్లు ఇవ్వలేకపోయారు? ►అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకున్నది తప్ప వేరే పాలన జరగలేదు ►గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ►అప్పట్లో డీపీటీ పాలన జరిగితే, మీ బిడ్డ హయాంలో డీబీటీ పాలన జరుగుతోంది ►చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ 26 వేల కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది ►చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు ►ఇవాళ ప్రతి సంవత్సరం 53.52 లక్షల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి 13500 పడుతోంది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఐదేళ్లలో రైతన్నలకు పంపిన మొత్తం 33,300 కోట్లు ►గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్సార్ ఆసరా అనే స్కీమే లేదు ►ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అక్షరాలా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 55 నెలల్లో ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి 19,178 కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ►గతంలో చంద్రబాబు హయాంలో వైయస్సార్ చేయూత అనే స్కీమే లేదు ►45-60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు స్వావలంబన కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయపడి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా రూ.18750 ఇస్తూ రూ.75 వేలు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడింది మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా 22.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి పంపిన సొమ్ము రూ.14,129 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల కోసం అందించాం ►వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు నేతన్నల కోసం అండగా నిలబడ్డాం ►వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 1302 కోట్లు నా డ్రైవర్ అన్నదమ్ములకు అండగా నిలిచాం. ►ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు ఇచ్చాం ►అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, జగనన్న తోడు ద్వారా 2955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 1253 కోట్లు ఇచ్చాం ►ఇలా చెప్పుకుంటూ పోతేలిస్టు చాంతాడంత కనిపిస్తుంది ►ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో లిస్టులు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు ►రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం, ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఈరోజు ప్రతి గ్రామంలో మార్పు కనిపిస్తుంది ►అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ►ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇంటికే వచ్చి అందిస్తున్నారు, ఇంటి వద్దకే అందుతున్న రేషన్, గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కనిపిస్తుంది. ►గ్రామంలో మారిన స్కూళ్లు, మారిన ఆస్పత్రులు, నాడునేడుతో మన కళ్ల ఎదుటే మార్పు కనిపిస్తున్న పరిస్థితులు, మన పిల్లల చేతుల్లో ట్యాబులు, స్కూళ్లలో ఐఎఫ్ పీ క్లాసు రూములు కనిపిస్తాయి ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి ►వైఎస్సార్ రైతు భరోసా, మెరుగులు దిద్దిన 108, 104, కనిపిస్తాయి ►1050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని మారుస్తూ 3250 రోగాలకుతీసుకుపోయి పేదవాడికి అండగా నిలబడ్డాం ►రైతులకు పగటిపూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితులు, చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, పిల్లలకు వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ►కేవలం ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతున్నమార్పులు గమనించాలి ►ఇంగ్లీషు మీడియం అంటే మీ జగన్.. ట్యాబులంటే మీ జగన్ ►గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్ పీలు అంటే దానికి కారణం మీ జగన్ ►గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరంటే మీ జగన్ ►ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి ►ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. ►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు. మోసాలు చూడాల్సి వస్తుంది ►ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామని చెప్పే నాయకుల మీ దగ్గరికి వస్తారు ►కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి ►రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ►అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా ►మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదు ►మీ బిడ్డకు తెలిసిన రాజకీయం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం, మీ బిడ్డ పైన దేవుడిని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు తప్ప మధ్యలో దళారులను నమ్ముకోలేదు ►మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు ►మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని, కుట్రలను కాదు. పైన దేవుడిని, కింద మిమ్మల్నిమాత్రమే నమ్ముకున్నాడు ►అప్రమత్తంగా ఉండండి అని మరోసారి విన్నవిస్తూ మీ అందరితోపాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. సంతోషపడుతున్నా. -
కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు (ఫొటోలు)
-
Live: వైఎస్ఆర్ పెన్షన్ కానుక..కాకినాడలో సీఎం జగన్ బహిరంగ సభ
-
పెన్షన్ పెంపు..కాకినాడలో పండగ వాతావరణం
-
సీఎం జగన్ కాకినాడ పర్యటన
-
నేడు కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా భాగస్వామే: సీఎం జగన్
Updates: ►తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న సీఎం జగన్ ►కాకినాడలో ముగిసిన సీఎం జగన్ పర్యటన ►సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. నా జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ►చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా?. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ రూ.58వేలు మాత్రమే ఇచ్చారు. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలి. మన ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నాం. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదు. ►గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నాం. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నాం. ►చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా పాట్నర్. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ-5 చూపించవు. ►2014 ఎన్నికల్లో దత్తతండ్రి, దత్తపుత్రుడు ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. ఈరోజు అదే దత్తపుత్రుడు పేదలకు ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనేది దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది. జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు. ►53 లక్షల 52వేల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. రైతన్నలకు ప్రతీ ఏటా రూ.13,500 అందిస్తున్నాం. రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.33,300 కోట్లు జమ చేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19,179కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం. 78 లక్షల 94వేల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా అందిజేస్తున్నాం. ►ప్రతీ గ్రామంలో సచివాలయం తెచ్చాం. ప్రతీ గ్రామంలోనూ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతీ గ్రామంలో మార్పు తెచ్చాం. ►ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం. నాడు-నేడుతో పాఠశాలలను ఆధునీకరించాం. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ప్రభుత్వమే మాత్రమే. చంద్రబాబు హయాంలో ఇవ్వన్నీ ఎందుకు జరగలేదు. ►రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. ఎన్నికల వేళ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని నేతలు వస్తారు. అలాంటి వారితో జాగ్రత్త’ అంటూ కామెంట్స్ చేశారు. ►కాకినాడలో ఆర్వోబీని ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►పింఛన్ల పెంపు ఉత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ ►పింఛన్ల మొత్తం రూ.1,967.34కోట్ల మెగా చెక్ ఆవిష్కరణ ►సభా వేదికకు చేరుకున్న సీఎం జగన్ ►కాకినాడ చేరుకున్న సీఎం జగన్. ►ముఖ్యమంత్రి జగన్కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ►మరికాసేపట్లో ఆర్ఎంసీ గ్రౌండ్స్కు చేరుకోనున్న సీఎం జగన్ ►అక్కడ జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ ఫించన్ కానుక రూ.3 వేలకు పెంపు. ►అనంతరం నగరంలో రూ.94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించినున్న ముఖ్యమంత్రి జగన్ ►సీఎం జగన్ రాకతో జనసంద్రమైన కాకినాడ నగరం ►రోడ్ షోలో పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు ►కాకినాడ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►వైఎస్సార్ పింఛన్ కానుక రూ.3వేలకు పెంపును ప్రారంభించనున్న సీఎం సాక్షి, తాడేపల్లి: విశ్వసనీయతకు అర్ధం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్గా పెన్షన్. పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ప్రతీ నెలా రూ.3,000 రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేయనున్నారు. పర్యటన ఇలా.. ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. వైఎస్సార్సీపీ రికార్డు.. ►గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ. 1,000.. ►ఐతే జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న పెన్షన్ ఒక్కో లబ్దిదారునికి రూ.3,000 ►గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు ►జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు ►గత ప్రభుత్వంలో సగటున ఖర్చు చేసిన మొత్తం నెలకు రూ. 400 కోట్లు మాత్రమే ►జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేస్తున్న ఖర్చు నెలకు రూ. 1,968 కోట్లు, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాదాపు ఐదు రెట్లు అధికం ►1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు.. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే. ►గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే.. ►పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి. ►పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్. పెన్షన్ పెంపు ఇలా.. జులై 2019 నుంచి పెన్షన్ను రూ.2,250లకు పెంపు. జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు. జనవరి 2023న రూ. 2,750కు పెంపు. జనవరి 2024న రూ.3వేలకు పెంపు. ►పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ►2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. ►జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు. ►జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు. ►జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు. ►జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు. ►గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760. ►ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు. ►పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు: ►గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు. ►2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు. ►2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు. ►2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు. ►2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు. పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే.. ►గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు. ►గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది. ►నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో బైయాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు. ►పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది. ►2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000 ►ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం. ►గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం. -
గడప వద్దే లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్న వలంటీర్లు
-
ఏపీలో ఉత్సహాంగా సాగుతున్న పింఛన్ల పంపిణీ
-
ఆంధ్రప్రదేశ్లో పండుగలా పింఛన్ల పంపిణీ.. లబ్ధిదారులకు 3 వేల చొప్పున పింఛన్లు పంపిణీ ప్రారంభం...ఇంకా ఇతర అప్డేట్స్
-
అవ్వాతాతల కళ్లల్లో ఆనందం..ఆయన ఏం చేసినా ప్రజలు కోసమే
-
ఏపీలో పండుగలా పెన్షన్లు పంపిణీ
-
AP: పండుగలా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి రూ.మూడు వేల చొప్పున ఈనెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి ఒకటి నుంచి రూ.మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీ వరకు మండలాల వారీగా ఉత్సవాలు నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూ రు చేసింది. మొత్తంగా ఈ నెలలో 66.34 లక్షల మందికి రూ.1,968 కోట్లను విడుదల చేసింది. పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు.. నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుంచి రూ.మూడువేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇలా సీఎం జగన్ తానిచ్చిన మాటను అమలుచేసి చూపించడంతో సోమవారం రాష్ట్రంలో పలు మండలాలు, మున్సిపాలిటీల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ పెన్షన్ లబ్దిదారులతో మమేకమవుతూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వలంటీర్లు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. -
అవ్వాతాతలకు న్యూ ఇయర్ గిఫ్ట్..నేటి నుండి 3 వేలు పెన్షన్
-
ఆంధ్రప్రదేశ్లో ‘సామాజిక’ సంబరం.. 3 వేల రూపాయలకు పెంచిన ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ నేటి నుంచి పంపిణీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: రేపటి నుంచి వైఎస్సార్ పెన్షన్ రూ.3000
సాక్షి, అమరావతి: రేపు(సోమవారం) ప్రజలంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కొత్త ఏడాది నుంచి ఏపీలో పెన్షనర్లకు వైఎస్సార్ పెన్షన్ కానుక మూడు వేలకు పెరగనుంది. పెన్షన్దారులకు మూడు వేలు అందనున్నాయి. కాగా, సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా జగనన్న ప్రభుత్వం మనసుతో పెంచి ఇస్తున్న.. వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్గా పెన్షన్, పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ఇకపై ప్రతీ నెలా రూ.3,000 ►రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు, గ్రామస్తులు అందరూ ఒకటో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ►3 జనవరి, 2024న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటూ, పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు సీఎం జగన్ అందజేయనున్నారు. ►దీంతోపాటు కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డుల పంపిణీ. ►దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ►గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే.. ►పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి. ►గత పాలనలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ కేటగిరిలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ.1,000. అయితే, జగనన్న ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి పెన్షన్ నెలకు రూ. 2,250తో మొదలుపెట్టి పెంచుకుంటూ రూ.3,000 దాకా తీసుకొచ్చింది. ప్రతీ నెలా ఠంచన్గా అందిస్తూ.. ►1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే. పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్. పెన్షన్ పెంపు ఇలా.. జులై 2019 నుంచి పెన్షన్ను రూ.2,250లకు పెంపు. జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు. జనవరి 2023న రూ. 2,750కు పెంపు. జనవరి 2024న రూ.3వేలకు పెంపు. ►పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ►2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. ►జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు. ►జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు. ►జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు. ►జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు. ►గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760. ►ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు. ►పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు: ►గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు. ►2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు. ►2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు. ►2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు. ►2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు. పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే.. ►గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు. ►గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది. ►నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో బైయాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు. ►పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది. ►2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000 ►ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం. ►గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం. -
66 లక్షల మంది పెన్షనర్లకు సీఎం జగన్ లేఖ
-
పింఛన్ రూ.3,000.. లబ్ధిదారులకు సీఎం లేఖ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు దేశంలో రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. ఒకటవ తేదీన వలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ, వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను అందజేయనున్నారు. ఇప్పటికే ఆ లేఖల ముద్రణ పూర్తయి, జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమే ఇవన్నీ చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నట్టు సీఎం జగన్ ఆ లేఖలో తెలిపారు. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నట్టు కూడా పేర్కొన్నారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. ప్రియమైన అవ్వాతాతలకు.. మీకు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు 2024 జనవరి 1 నుంచి.. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక మీ చేతికి అందే పెన్షన్ రూ.3000 అవుతుంది. నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వాతాతలను, దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను.. కష్టాలు, కన్నీరు తుడిచే వారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యథలను నేను స్వయంగా చూశాను. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి.. మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూ.చా. తప్పక పెన్షన్లను పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో, దేవుడి దయతో అందిస్తునందుకు సంతోషిస్తున్నాను. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పింఛన్ కేవలం రూ.1,000 ఉండేది. ఆ ఐదేళ్లలో ఒక్కో అవ్వాతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ రూ.58 వేలు. అదే మీ జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.47 లక్షలు. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి.. కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలని చెప్పడానికీ సంతోషిస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ, పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు, పెన్షన్ తీసుకోవడానికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు. కానీ, ఇప్పుడు ప్రతినెలా ఒకటో తేదీన.. అది ఆదివారమైనా, మరే ఇతర సెలవు రోజైనా సరే సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెపుతూ మన వలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు. పెన్షన్ కోసం పడిగాపులు పడి, ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు.. మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా.. మనది మనసున్న ప్రభుత్వం. మనది పేదలు, మహిళలు, రైతుల పక్షపాత ప్రభుత్వం. దేశంలోనే రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమని, ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. మీ ఆశీస్సులతోనే ఇదంతా చేయగలిగాను. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఆ బలం వల్లే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు మంచి జరగాలని.. ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ.. మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేమతో మీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ఒకటి నుంచి పెరిగిన పింఛన్ల పంపిణీ
రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ పింఛన్ కానుక కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.2,750ను రూ.3 వేలకు పెంచినట్టు డీఆర్డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వీవీఎస్ మూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. పెరిగిన పింఛన్ల పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి ఒకటి నుంచి 8వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 3న కాకినాడలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని, అదే రోజు కలెక్టరేట్ కార్యాలయాల్లో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, మంత్రులు, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 18 రకాల పింఛన్లు 2,44,840 ఉన్నాయని, వాటికి రూ.67.57 కోట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. వీటిలో 8 రకాల పింఛన్లను రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచడం ద్వారా పంపిణీ సొమ్ము రూ.72.66 కోట్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,44,840లకు అదనంగా ఆరునెలలకు ఒకసారి కొత్తగా మంజూరయ్యే పింఛన్లు సుమారు 10,000 వరకూ ఉన్నాయన్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ జరుగుతుందని, దీంతో పింఛన్లు 2,54,000కు చేరుకుని, వీటి పంపిణీ నిమిత్తం రూ.75 కోట్లు వరకూ ఖర్చు అవుతుందన్నారు. నిడదవోలు అర్బన్లో జనవరి ఒకటో తేదీన, నిడదవోలు రూరల్, తాళ్లపూడి, గోకవరం, దేవరపల్లి మండలాల్లో రెండున, అనపర్తి, కడియం, సీతానగరాల్లో మూడున, పెరవలి, బిక్కవోలు, చాగల్లు, కొవ్వూరు రూరల్, కొవ్వూరు అర్బన్, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం అర్బన్, రాజానగరాల్లో నాలుగున, గోపాలపురం, రంగంపేటల్లో ఐదో తేదీన, కోరుకొండ, నల్లజర్ల, ఉండ్రాజవరం మండలాల్లో ఆరున పింఛన్ల పంపిణ జరుగుతుందన్నారు. -
అవ్వాతాతలకు పెన్షన్ల పెంపు మొదలు ఎన్నికల హమీలన్నీ పూర్తిగా నేరవేరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటన ..ఇంకా ఇతర అప్డేట్స్
-
అవ్వాతాతల వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు
-
సీఎం జగన్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం
-
ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల నుంచి అవ్వాతాతల వైఎస్సార్ పెన్షన్ కానుక 3 వేల రూపాయలకు పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..ఇంకా ఇతర అప్డేట్స్