-
యువకుడి బైక్పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి..
సాక్షి, హైదరాబాద్: యువకుడి బైక్పై వెళుతున్న భార్యను గమనించిన భర్త.. వారిని వెంబడించి ఆ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు. మృతుడికి సదరు మహిళతో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పీఎస్లో లొంగిపోయినట్లు తెలిసింది.. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్ క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు చోటుచేసుకోవడం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్దేవ్పల్లి పరిధిలో రెండు హత్యలు జరిగాయి. ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. తాగతాజగా. చాదర్ఘాట్ సమీపంలో మరో హత్య జరిగింది. వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చదవండి: స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం -
HYD: పక్కనే బాయ్స్ హాస్టల్.. బాత్రూంలో ఉండగా వీడియో తీసి..
అమీర్పేట(హైదరాబాద్): మహిళ బాత్రూంలో ఉండగా వీడియో తీసిన యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం జనగాంలో అత్తగారింట్లో ఉండే ఓ గృహిణి ఎస్ఆర్నగర్ చిన్న గురుద్వారా వద్ద ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. శనివారం మధ్నాహ్నం ఆమె బాత్రూంకు వెళ్లగా.. పక్కనే శ్రీదేవి బాయ్స్ హాస్టలో ఉండే కిరణ్ అనే యువకుడు టెర్రస్పైకి ఎక్కి ఎగ్జాస్ట్ ఫ్యాను వద్ద సెల్ పెట్టి వీడియో తీశాడు. దీనిని గమనించిన మహిళ చుట్టు పక్కన ఉండే వారిని అప్రమత్తం చేయడంతో యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
హాయ్ చెప్పినందుకు చితక్కొట్టారు..
సాక్షి, కరీంనగర్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్న లక్కీ బార్కు వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సేవిస్తున్న మరో నలుగురు ఫ్రెండ్స్ ఉండగా.. శ్రీకాంత్ హాయ్ చెప్పాడు. అయితే, శ్రీకాంత్ వెటకారంగా నమస్తే చెప్పినట్టు భావించిన ఆ నలుగురు ఫ్రెండ్స్ అప్పటికే మద్యం మత్తులో కూడా ఉండటంతో.. బార్ లోనే శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో.. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: హైదరాబాద్లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? -
Viral Video: బాల్కనీ నుండి బోర్లా పడ్డాడు..!
-
వైజాగ్లో కిడ్నాప్.. తాడివారిపల్లెలో హత్య
పొదిలిరూరల్: ఒంగోలు–నంద్యాల రహదారిలో తాడివారిపల్లె చెక్పోస్ట్ సమీపంలో కాలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధం నేపథ్యంలో బత్తుల దేవధరణి అనే యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుధవారం రాత్రి పొదిలి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి యువకుడి హత్య కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరు గ్రామానికి చెందిన బత్తుల దేవధరణి(22) చిన్నప్పటి నుంచి చెడు వ్యవసనాలకు బానిసై తిరుగుతుండేవాడు. మహిళలకు పోన్ చేసి మాట్లాడటం, ఆకతాయితనంగా ఉండటంతో తన అన్న పవన్సాయి విశాఖపట్టణంలో తన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇంటర్ వరకు చదివించడంతోపాటు ఓ రెస్టారెంట్లో పనిలో చేర్చాడు. చదువు మధ్యలో ఆపేసిన దేవధరణి నిత్యం సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో గంగ అనే యువతి పరిచయం కాగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గంగకు ప్రవీణ్కుమార్ అనే వ్యక్తితో ముందే అక్రమ సంబంధం ఉంది. దీంతో దేవధరణి, ప్రవీణ్కుమార్ మధ్య తరచూ వివాదం నడుస్తోంది. వీరిద్దరితో పవన్సాయి మాట్లాడి సర్దుబాటు చేసినప్పటికీ గంగతో దేవధరణి చాటింగ్ చేయడం మాత్రం ఆపలేదు. దీంతో దేవధరణిని అడ్డు తొలగించాలని ప్రవీణ్కుమార్ పథకం రచించాడు. అహోబిలం వెళ్లేందుకని చెప్పి జనవరి 30న బాడుగకు కారు మాట్లాడాడు. మనోజ్, చాణక్య, శివకుమార్, నరేష్, స్వప్న అనే యువతితో దేవధరణిని నమ్మబలికించి కారులో ఎక్కించారు. మార్గమధ్యంలో దేవధరణికి క్లోరోఫామ్ ఇచ్చి స్పహలో లేకుండా చేశారు. క్లోరోఫామ్ ప్రభావంతో దేవధరణి కారులోనే మలమూత్రాలు విసర్జించడంతో తర్లుపాడు మండలం తాడివారిపల్లె ఘాట్ రోడ్డులో కారు ఆపి కిందకు దించారు. అటవీ ప్రాంతంలో కత్తితో గొంతు కోసి, పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేవధరణి కనిపించకపోవడంతో సోదురుడు పవన్సాయి విశాఖపట్టణం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు చంపడానికి ఉపయోగించిన బాడుగ కారు డ్రైవర్ శివకిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుల్లో ఒకడు అరెస్టయ్యాడని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో పొదిలి సీఐ సుధాకర్రావు, తర్లుపాడు ఎస్సై ముక్కంటి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
ప్రియురాలు దక్కలేదని.. యువకుడు షాకింగ్ నిర్ణయం
దొర్నిపాడు(కర్నూలు జిల్లా): ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలపరిధిలోని చాకరాజువేముల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు.. చాకరాజువేముల గ్రామానికి చెందిన జకరయ్య, రత్మమ్మ దంపతులకు ఒక కుమార్తె, ప్రవీణ్కుమార్, ప్రసన్న కుమార్ అనే ఇద్దరు కుమారులు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుమారులు ఉద్యోగం చేస్తున్నారు. ప్రసన్న కుమార్(24) అప్పుడప్పుడు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని పిన్ని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, లక్ష్మీదేవి యువకుడిని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్నకుమార్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో విషగుళికలు మింగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టం లేక యువతి తల్లిదండ్రులు తమ కుమారుడిని బెదిరించినట్లు ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మహేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత.. -
సికింద్రాబాద్: స్నేహితుడు చేతిలో యువకుడి హత్య
-
విజయనగరం: కబడ్డీ ఆటలో యువకుడు మృతి
-
Viral Video: వాగులో పడిన కుక్క.. ప్రాణాలు తెగించి కాపాడిన యువకుడు
-
నడిరోడ్డుపై వేట కొడవలితో మహిళపై దాడి...అంతలో...
కొచ్చి: ఒక వ్యక్తి పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవలితో ఒక మహిళపై దాడి చేసేందుకు తెగబడ్డాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈ ఘటన కాలూర్లోని అజాద్ రోడ్డుపై పట్టపగలే బహిరంగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు, ఇద్దరు మహిళల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ యువకుడు వేటకొడవలితో ఒక మహిళ తలపై దాడి చేసేందుకు పలుమార్లు యత్నించగా.. పక్కనే ఉన్న మరో మహిళ గట్టిగా అడ్డుకోవడంతో ఆమె చేతికి త్రీవ గాయలయ్యాయి. ఆ తర్వాత సదరు యువకుడు ఆ కొడవలిని అక్కడే పడేసి మోటార్ బైక్పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని, దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. పోలీసులు నిందితుడి ఆచూకి కోసం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: గుండెల్ని మెలిపెట్టే విషాద ఘటన.. ‘అమ్మానాన్నను త్వరగా రమ్మని చెప్పండి’..) -
కేక్ కట్ చేసి ఎంత పని చేశాడంటే.. ఊహించని ట్విస్ట్
మైసూరు(కర్ణాటక): పుట్టిన రోజు నాడు ఆ ఇంట విషాదం తాండవించింది. అన్న తమ్ముడు గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు నగరంలోని మండి మొహల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్లో పనిచేసే దర్శన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ చేస్తుంటాడు. ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వచ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు. ఆ ఆగ్రహంలో దర్శన్ కేక్ తీసుకొని వచ్చి కట్ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..? -
యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..
చిత్తూరు అర్బన్: నగరంలోని తేనబండకు చెందిన పూజిత (19) కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేనబండకు చెందిన బుజ్జి తన భార్య, కుమార్తె పూజితతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి మెలకువ రావడంతో లేచి చూసిన బుజ్జికి తన కుమార్తె కనిపించలేదు. తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 8555810860కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ -
రూమ్కు తీసుకెళ్లి రోల్డ్గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..
కొత్తపేట(కోనసీమ జిల్లా): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్సై డి.శశాంక శనివారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా నమ్మించాడు. ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒకసారి శారీరకంగా కలిశాడు. మళ్లీ 12న బాలిక స్కూల్లో ఉండగా వెళ్లి తన ఫ్రెండ్ బర్త్డేకు పలివెల వెళ్లివద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక రూములో రోల్డ్గోల్డ్ ఉంగరం తీసి, బాలిక వేలుకు తొడిగి, పెళ్లయిపోయిందని నమ్మించి, మరోసారి శారీరకంగా కలిశాడు. వారి బాగోతం ఆ బాలిక పెద్దలకు తెలియడంతో ఆ యువకుడు ముఖం చాటేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య -
ఏం జరిగిందో.. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే.. అంతలోనే అదృశ్యం
సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): మండల పరిధి కడపాయపల్లె గ్రామ పంచాయతీలోని మంగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన సౌమ్య(20) అదృశ్యమైనట్లు తండ్రి నరసింహులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ తులసీనాగప్రాద్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సౌమ్య కడప నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో లేక పోవడంతో గాలించారు. గ్రామంలో కనిపించక పోవడంతో సిద్దవటం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఉసురు తీసిన ఇద్దరితో వివాహేతర సంబంధం.. ద్రోహం చెయ్యొద్దంటూ.. -
Vizag: ఏం జరిగిందో..? ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా..
అల్లిపురం(విశాఖపట్నం): ఇంటి నుంచి బయటికివెళ్లిన తన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కనకలవీధికి చెందిన దోని చంద్రకళ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం దోని జగదీశ్వరి (24) తల్లిదండ్రులు చంద్రకళ, ఎల్లాజీరావులతో కలసి కనకలదిబ్బలో నివసిస్తోంది. చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. ఈ నెల 10వ తేదీ ఉదయం 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఆమె కోసం నగరంలో పలు ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోను వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిపోయిన జగదీశ్వరి ఎత్తు సుమారు 155 సెంటీమీటర్లు. చామనఛాయతో, గుండ్రని ముఖం కలిగి ఉందని, నీలం రంగు ఫ్యాంటు, బిస్కట్ కలర్ టీషర్టు వేసుకుని ఉందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 6440796010 ఫోన్ నంబర్లలో తెలియజేయాలని కోరారు. -
వస్త్ర దుకాణంలో పరిచయం... యువతిని నమ్మించి, కోరిక తీర్చుకుని..
కొవ్వూరు(తూర్పుగోదావరి): నమ్మించి, ఓ యువతిని మోసగించిన అభియోగంపై రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కొండ్రు ప్రేమ్కుమార్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాడపల్లికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, సమీపంలోని స్టూడియోలో ప్రేమ్కుమార్ పనిచేసేవాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటూనంటూ ప్రేమ్కుమార్ ఆమెను నమ్మించి, తన అవసరం తీర్చుకున్నాక మొహం చాటే శాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రేమ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. -
మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బస్సులో బయలుదేరి..
అట్లూరు(వైఎస్సార్ జిల్లా): మండలంలోని లింగాలకుంట ఎస్టీ కాలనీకి చెందిన పేరూరు మధుభారతి (21) అనే యువతి అదృశ్యమైంది. ఎస్ఐ నాగ చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధుభారతి గురువారం కడపలోని తన మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బస్సులో బయలుదేరింది. ఆమె అక్కడికి చేరుకోకపోవడంతో.. బంధువులు, స్నేహితులను కుటుంబ సభ్యులు విచారణ చేశారు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో యువతి తల్లి గోపాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. ఇలా ఒక్కటయ్యారు.. ఆ పెళ్లిలో ఇదే ప్రత్యేక ఆకర్షణ -
అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’
గార్లదిన్నె(అనంతపురం జిల్లా): అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్(23), అభిరామ్ స్నేహితులు. వీరికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య! దీంతో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న గాడ్ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ అభిరామ్ను స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడ్డ యువతి అనంతపురం శ్రీకంఠంసర్కిల్: స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన గాడ్ఫాదర్ ఈవెంట్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా అభిమానులు తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. అభిమాన హీరోని చూడాలనే ఆత్రుత కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనంతపురంలోని రహమత్నగర్కు చెందిన అఖిల అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
ఏడేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు.. షాకిచ్చిన ప్రియురాలు.. ఏం చేసిందంటే?
పొదలకూరు(నెల్లూరు జిల్లా): ఏడేళ్లుగా ప్రేమించి, మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేశాడని ఓ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు చేజర్ల మండలం ఏటూరుకు చెందిన యువతి, పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామానికి చెందిన హరినారాయణ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్మగ్లింగ్లో ‘పుష్ప’ను మించిపోయాడు.. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని యువతి కోరగా, ఆ యువకుడు స్పందించలేదు. దీంతో బాధితురాలు ప్రియుడు హరినారాయణ తనను నమ్మించి మోసం చేశాడంటూ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీ అరుణ, సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తాను ఎస్సీ కులం కావడంతో హరినారాయణ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపింది. పోలీసులు వెంటనే హరినారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. హరినారాయణతోనే తన వివాహం జరిపించాలని విజ్ఞప్తి చేసింది. -
షాకింగ్ ఘటన.. నాన్నను కాపాడేందుకు వెళ్లి..
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ముమ్మరంగా గాలింపు గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన
జడ్చర్ల(మహబూబ్నగర్): ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ, పట్టాలు దాటబోయి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేపోలీసుల వివరాల ప్రకారం.. బాదేపల్లిలోని బక్కరావు కాంపౌండ్లో ఉండే వడ్డె వినయ్కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. ఉదయం జిమ్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు వింటూ రైల్వేస్టేషన్ గేటు దగ్గర పట్టాలు దాటబోయాడు. ఆ సమయంలో అటుగా మహబూబ్నగర్ వైపు గూడ్స్ రైలు వెళ్తోంది. వినయ్ గమనించకుండా పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్సీ కృష్ణ తెలిపారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య -
అమ్మాయితో లవ్.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఇంతలోనే అబ్బాయి షాకింగ్ నిర్ణయం
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామానికి చెందిన కంసల మహేంద్ర (19) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు మహేంద్ర తెలిపాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో వారం రోజుల క్రితం ఆ యువతిని తీసుకుని బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కులాంతర వివాహానికి పెద్దలు ఎంత మాత్రం అంగీకరించలేదు. అంతేకాక ఇరు కుటుంబాల పెద్దలు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు, గ్రామ పెద్దలు ప్రయత్నించి, విఫలమయ్యారు. దీంతో మనస్తాపం చెందిన మహేంద్ర శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే మహేంద్రను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి..
పెదగంట్యాడ(విశాఖపట్నం): మండలానికి చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని నడుపూరులో గంపల దాముదమ్మ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. చదవండి: గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు.. ఈమె కుమార్తె గంపల లలితారాణి (19) ఈ నెల 8న పుట్టినరోజు సందర్భంగా బయటకు వెళ్లి వస్తానని చెప్పి, వెళ్లింది. తర్వాత ఇంటికి రాలేదు. దీంతో యువతి తల్లి, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో న్యూపోర్టు పోలీసులను సంప్రదించారు. న్యూపోర్టు హెచ్సీ పీవీ రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హర్షిణి ఎక్కడున్నావమ్మా.. తండ్రి తిట్టాడని..
హిమాయత్నగర్(హైదరాబాద్): తండ్రి తిట్టాడనే మనస్తాపంలో కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్రెడ్డి సమాచారం మేరకు... విఠల్వాడీలో ఉండే మనీష్నాయుడు తన కుమార్తె హర్షిణి(17)ని శనివారం రాత్రి కుటుంబ గొడవల కారణంగా కోప్పాడ్డాడు. చదవండి: జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ దీంతో ఆదివారం ఉదయం బయటికని చెప్పి వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా హర్షిణి ఆచూకీ తెలియలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్షిణి ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94906 16314లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ కోరారు.