wrestling
-
క్రీడా జగతిలో మహిళల దుఃస్థితికి అద్దం
ఒక దశాబ్దం పాటు రెజ్లింగ్లో ఆధిపత్యం చలాయించిన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మహిళా మల్లయోధులు పోరాడుతున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్పై లైంగిక ఆరోపణలు కొత్తవి కావు. 2016లోనే అలాంటి కథనం పత్రికలో వచ్చింది. కానీ దాన్ని సద్దుమణిగేలా చేశారు. క్రీడలలో మహిళలపై లైంగిక వేధింపులు ‘అసాధారణం కాదు’ అనేది కలవరపరిచే వాస్తవం. భారతీయ క్రీడలను ఎంత బలహీనంగా మేనేజ్ చేస్తున్నారో దేశానికి తెలిసేలా చేయగలిగారు మన రెజ్లర్లు. ఇది బీజేపీతో ప్రారంభం కాలేదు, దీనితో ముగిసిపోదు. క్రీడా సమాఖ్యల నుండి రాజకీయ నాయకులను బయటకు పంపిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. కేసును పోలీసులు ఎలా నిర్వహిస్తారు, బ్రిజ్భూషణ్కు ఏమవుతుంది అనేది క్రీడల్లోకి అడుగుపెడుతున్న అమ్మాయిలకు ఒక సంకేతంగా ఉంటుంది. ఇలా చెప్పడం నాకు బాధగా ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటేరియన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిరసన తెలుపుతున్న భారతదేశపు ప్రముఖ రెజ్లర్లు, ఇప్పుడు వెనుకకు నెట్టబడి ఉండవచ్చు. వేధింపులు, అధికార దుర్వినియోగ ఆరోపణలతో ప్రజల్లోకి వెళ్లే మహిళలకు తరచుగా జరిగే విధంగానే వ్యవస్థ సంపూర్ణ శక్తి సాధారణంగా వారికి వ్యతిరేకంగా ప్రబలంగా ఉంటుంది. అది ఫిర్యాదుదారుల శక్తిని మించిపోతుంది. దీనిపై స్పందించిన రెజ్లర్లు తాము తిరిగి ప్రాక్టీసుకు రావడాన్ని తమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గినట్లు చూడకూడదని చెప్పారు. వారు నిరంతర నిబద్ధతతో బలంగా నిలబడిన కారణంగానే వారికీ, ప్రభుత్వానికీ మధ్య ఇటీవలి రౌండ్ చర్చలకు దారితీసింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఛార్జిషీట్ దాఖలుకు జూన్ 15ను డెడ్లైన్ గా విధించారు. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లు్యఎఫ్ఐ) నిర్వహణ కోసం జూన్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించారు. ఈ నిర్దిష్ట ప్రతిపాదనలను స్వాగతించాలి. జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమం జరిగినప్పుడు వారిని లాగిపడేయడం, దూరంగా తీసుకుపోవడానికి ప్రయత్నించడానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయిన తర్వాత, మల్లయోధుల పట్ల ప్రజల్లో ఏర్పడిన విస్తృత సానుభూతిని ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. అయితే మరి తర్వాత ఏమి జరుగుతుందనే విషయంలో నేను ఎందుకు సంశయంగా ఉన్నాను? ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ‘లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం’ (పోక్సో)కి చెందిన దరఖాస్తు ఉన్నందున ఆయన్ని వెంటనే అరెస్టు చేయడానికి బలమైన చట్టపరమైన ఆధారం ఉంది. వేధింపులు, దుర్వినియోగంతోపాటు వేధింపులకు సంబంధించిన 12 విభిన్న సందర్భాలను వారి ప్రథమ సమాచార నివేదికల (ఎఫ్ఐఆర్లు)లో పేర్కొన్న ఏడుగురు ఫిర్యాదుదారులలో ఒకరు మైనర్.అయితే గత వారం రోజులుగా మైనర్ తండ్రి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. తన కుమార్తె పట్ల చెడుగా ప్రవర్తించాడని అనుకున్నందున తాను సింగ్ మీద తప్పుడు వేధింపు ఆరోపణలు చేసినట్లుగా ఆయన ఇప్పుడు చెబుతున్నారు. ఒత్తిడి, బెదిరింపుల పర్యవసానంలా కనిపిస్తున్న ఈ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల (తన కుటుంబం భయంతో కొట్టుమిట్టాడుతోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు), కేవలం తన కుమార్తె కేసును మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి కేసునూ బలహీనపరిచే అవకాశం ఉంది. తన తొలి ఫిర్యాదులో, తన కూతురును ముందుకు రాకుండా చేసిన భయాన్ని తండ్రి ప్రస్తావించాడు. మరి ఈ రోజు కూడా అదే భయం ఆయన్ని ఆడిస్తోందా? కలవరపరిచే వాస్తవాలు వాస్తవం ఏమిటంటే, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ చందర్ శేఖర్ లూథ్రా ఎత్తి చూపినట్లుగా, సింగ్పై దుర్వినియోగ ఆరోపణలు కొత్తవి కావు. అవి అంతకు ముందూ నమోదయ్యాయి. లూథ్రా నాతో మాట్లాడుతూ, 2016లో లక్నోలోని మహిళా శిబిరానికి హాజరైన ముగ్గురు యువ క్రీడాకారిణులు తమను బ్రిజ్భూషణ్ హోటల్ రూముకు రమ్మని పిలిచారని ఫిజియో థెరపిస్టుతో చెప్పినప్పుడు అలాంటి సంఘటన మొదటిసారి బయటపడిందని చెప్పారు. ‘‘మేము నివేదించిన కథనాన్ని ఒక హిందీ వార్తాపత్రిక వాస్తవంగా ప్రచురించింది; కానీ అంతా సద్దుమణిగిపోయేలా చేశారు’’ అని లూథ్రా చెప్పారు. మహిళా క్రీడాకారిణులకు బ్రిజ్ భూషణ్ వల్ల కలుగుతున్న వ్యథల గురించి ప్రభుత్వంలోని అధికారులకు కూడా తెలుసునని ఎఫ్ఐఆర్ ఆరోపించింది. ఆసియా ఛాంపియన్ షిప్లో ఫొటో అవకాశం సందర్భంగా సింగ్ ‘‘నా పిరుదులపై చేయి వేయడానికి ప్రయత్నించారు’ అని ఒక ఫిర్యాదుదారు చేసిన ప్రకటనను అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్ సింగ్ కూడా ధ్రువీకరించారని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ వార్తాపత్రిక నివేదించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాల గురించి, ముఖ్యంగా గ్యాంగ్స్టర్లకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ సింగ్ను తాను విచారించినట్లు ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ నాతో చెప్పారు. చివరికి కోర్టులో కేసు వీగిపోయినప్పటికీ, సింగ్ నిర్దోషిగా విడుదలైనప్పటికీ, ‘‘భూషణ్ ప్రమాదకరమైన వ్యక్తి’’ అని నీరజ్ కుమార్ నాతో అన్నారు. ఒకప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు సలహాదారుగా ఉన్న కుమార్, క్రీడలలో మహిళలపై లైంగిక వేధింపులు ‘‘అసాధారణం కాదు’’ అనే వాస్తవాన్ని నొక్కిచెప్పారు. యువ మహిళా క్రికెటర్లు, క్రికెటర్ల తల్లుల నుంచి లైంగిక అనుకూలతను ఆశించిన సెలెక్టర్లు, కోచ్ల గురించిన ఆరోపణలు కూడా తనకు తెలుసుననేంత వరకూ నీరజ్ వెళ్లిపోయారు. ఆయన మాటలు వింటున్నప్పుడు నాకు ఒళ్లు జలదరించింది. భారతీయ క్రీడలను ఎంత బలహీనంగా మేనేజ్ చేస్తున్నారో తెలిసేలా రెజ్లర్లు దేశం దృష్టిని అటువైపుగా మళ్లించారు. ఇది బీజేపీతో ప్రారంభం కాలేదు, దీనితో ముగిసిపోదు. క్రీడా సమాఖ్యల నుండి రాజకీయ నాయకులను బయటకు పంపిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. లేదంటే, రాజకీయ అధికారం, ఫెడరేషన్ల నియంత్రణ మధ్య ఉన్న దుష్ట సంబంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. మౌనమే నయమా? కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్ను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇదంత సులభం కాదు. రెజ్లర్లు ఎత్తి చూపినట్లుగా, బ్రిజ్ భూషణ్కు ఫెడరేషన్ పై గట్టి పట్టు ఉంది. ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ దాని ఉపాధ్యక్షుడు; ఆయన అల్లుడు ఆదిత్య ప్రతాప్ సింగ్ సంయుక్త కార్యదర్శి. రెజ్లింగ్ ఫెడరేషన్ మీద బ్రిజ్ భూషణ్ సింగ్ పరివార్ నిర్బంధం సమగ్రంలా కనబడుతోంది. గత వారాంతంలో ఆయన చేపట్టిన అయోధ్య ర్యాలీని రద్దు చేసినప్పటికీ, భారీగా జనానికి చేరువయ్యేలా తన ఉత్తరప్రదేశ్ నియోజకవర్గంలో పర్యటిస్తానని సింగ్ ప్రకటించారు. అధికారానికి సంబంధించిన ఇలాంటి సంకేతాల మధ్య, మీరు ఫిర్యాదుదారుని కుటుంబం భయపడిందని నిందించగలరా? ప్రత్యేకించి బ్రిజ్ భూషణ్ సింగ్ లేదా ఆయనతో సంబంధం ఉన్నవారు... మిమ్మల్ని మీ కెరియర్లో పైకి తేగలిగి, అవసరమైతే తొక్కేయగలిగిన పక్షంలో. ఒక దశాబ్దం పాటు రెజ్లింగ్లో ఆధిపత్యం చలాయించిన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మహిళా క్రీడాకారులు పోరాడుతున్నారు. పోలీసులు ఈ కేసును ఎలా నిర్వహిస్తారు, బ్రిజ్ భూషణ్కు ఏమి జరుగుతుంది అనేది మనందరికీ ఒక సంకేతం; ముఖ్యంగా భారతీయ మహిళలు, అది పెద్దవాళ్లయినా, చిన్నవాళ్లయినా, ఇంకా ముఖ్యంగా ఇప్పుడే క్రీడల్లోకి అడుగుపెట్టిన బాలికలకు ఇది సూచనగా ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడినందుకు ఇది వారు చెల్లించాల్సిన మూల్యం అని వాళ్ళు నమ్మాలని మనం కోరుకుందామా? మౌనం సురక్షితమని వారు భావించాలని మనం కోరుకుందామా? బర్ఖా దత్ వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయురాలు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
WFI (రెజ్లింగ్ ఫెడరేషన్) ఎన్నికలకు ముహూర్తం ఖరారు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలు జులై 4న జరుగుతాయని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సోమవారం ప్రకటించింది. జమ్మూ అండ్ కశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్ను రిటర్నింగ్ అధికారిగా నియమించడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లు IOA తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో పదవీకాలాన్ని ( 3 విడతలు, 12 సంవత్సరాలు) పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. WFI ముందుగా మే 7న ఎన్నికల తేదీని ప్రకటించింది. అయితే వివాదాల నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఒప్పుకోలేదు. ఎన్నికలను నిర్వహించడానికి ఇద్దరు సభ్యుల తాత్కాలిక కమిటీని నియమించి, నూతనంగా ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది. కాగా, గత కొద్ది వారాలుగా భారత రెజ్లర్లు WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంతో పలు చర్చల అనంతరం రెజ్లర్లు ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ వరకు ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం ముందు రెజ్లర్లు ఐదు డిమాండ్లు ఉంచారు. అవేంటంటే.. 1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి. 2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. 4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి. 5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలి. చదవండి: డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్లపై వేటు..? -
'నా ప్రేమకు దక్కింది విషమే'..బ్రిజ్ భూషణ్ జీవిత పాఠాలు..!
ఉత్తరప్రదేశ్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజకీయ జీవితంలో బిజీ అయిపోయారు! ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోని గోండాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. 2024లో తాను ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే..ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఇంట్రెస్టింగ్ కవిత చెప్పారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. 'కొన్నిసార్లు కన్నీళ్లే మిగులుతాయి. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే. కొందరు నన్ను తిడుతున్నారు. పొగుడుతున్నారు. నా పేరే నిత్యం పలుకుతున్నారు.'అంటూ సాగిన ఈ కవితను 2024 ఎన్నికల కోసం బీజేపీ నిర్వహించిన మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా వినిపించారు. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బ్రిజ్ భూషణ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశం కోల్పోయినదంతా ప్రధాని మోదీ తీసుకువస్తున్నారని అన్నారు. బ్రిజ్ భూషణ్పై ఆరోపణలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి:వీడియో, ఆడియో, వాట్సాప్ చాటింగ్ ఆధారాలుంటే చూపించండి... -
రెజ్లర్లకు షాక్!
-
ఆ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ది ఆత్మహత్యే
2022, అక్టోబర్ 5న టెక్సాస్లోని (అమెరికా) తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ సారా లీ (30)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్థానిక మెడికల్ అధికారులు తాజాగా వెల్లడించారు. సారా డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో తొలుత పలు అనమానాలు వ్యక్తం చేసిన అధికారులు, తాజాగా విడుదల చేసిన అటాప్సీ రిపోర్ట్లో సారాది ముమ్మాటికీ ఆత్మహత్యేనని నిర్ధారించారు. చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? బెక్సార్ కౌంటీ మెడికల్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. యాంఫటమైన్స్, డాక్సిలామైన్, ఆల్కహాల్ కలిపి సేవించడం వల్ల సారా మరణించిందని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని, సారా శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి ముందు కింద పడటం వల్ల ఏర్పడ్డవేనని నిర్ధారించబడింది. దీంతో సారా మృతిపై గత కొద్ది రోజులుగా ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారాను ఎవరు ఏమీ చేయలేదు.. మరి అంత చిన్న వయసులో (30) ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సారా 2015 మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment) ఛాంపియన్షిప్ను గెలిచిన విషయం తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఛాంపియన్గానే కాకుండా అమెరికన్ టీవీ పర్సనాలిటీగా కూడా అందరికీ సుపరిచితం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001, మెయిల్: roshnihelp@gmail.com -
కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. ప్రియాంక గాంధీ సంఘీభావం
న్యూఢిల్లీ: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా... తమ నిరసనను ముగించేందుకు రెజ్లర్లు ఇష్టపడటం లేదు. జంతర్మంతర్ వద్ద శనివారం కూడా ఈ నిరసన కొనసాగింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆటగాళ్లకు తమ సంఘీభావం ప్రకటించారు. అయితే కొందరు బయటి వ్యక్తులు నిరసన వేదిక వద్ద వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని రెజ్లర్ బజరంగ్ పూనియా ఆరోపించాడు. తమ ఉద్యమం రెజ్లర్ల సమస్యలకే పరిమితమని, ఇతర రాజకీయ అంశాల జోలికి తాము వెళ్లడం లేదని అతను అన్నాడు. మరో వైపు తాజా అంశంపై ‘ఫొగాట్’ సోదరీమణుల మధ్య విభేదాలు తలెత్తాయి. నిరసనలోకి రాజకీయ నాయకులను రానివ్వొద్దంటూ బబిత ఫొగాట్ విమర్శించగా... మహిళా రెజ్లర్ల తరఫున నిలవడం ఇష్టం లేకపోతే, కనీసం నిరసనను బలహీనపర్చవద్దని వినేశ్ జవాబిచ్చింది. -
రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు.. బ్రిజ్భూషణ్పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా బ్రిజ్భూషణ్పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తామని ఇచి్చన హామీని పూర్తి చేశారు. బ్రిజ్భూషణ్పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ ‘పోక్సో యాక్ట్’ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్... ఇతర రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ప్రకారం మరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. రెండింటిపై సత్వర విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై మే 5న మరోసారి విచారిస్తామని, ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఫిర్యాదు చేసిన వారి జాబితాలో ఉన్న ఒక మైనర్ రెజ్లర్ భద్రతకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు బాధ్యత తీసుకోవాలని కూడా సుప్రీం సూచించింది. ‘మైనర్ రెజ్లర్కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుంటూ తగినంత భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నాం. ఇతర రెజ్లర భద్రతను కూడా ఆయన సమీక్షించాలి. దర్యాప్తునకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంపై గోప్యత కూడా పాటించాలి’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా బెంచీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బజరంగ్, వినేశ్, సాక్షి తదితర రెజ్లర్లు జంతర్మంతర్ వద్ద తమ నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించడం పట్ల రెజ్లర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రమే కాదు, బ్రిజ్భూషణ్ అరెస్ట్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని బజరంగ్ స్పష్టం చేశాడు. ‘విజయం దిశగా ఇది మొదటి అడుగు మాత్రమే. అయితే మా నిరసన ఇకపైనా కొనసాగుతుంది. ఆయనను అన్ని పదవుల నుంచి తప్పించడంతో పాటు జైలుకు పంపాల్సిందే. లేదంటే విచారణను ప్రభావితం చేస్తాడు’ అని రెజ్లర్ సాక్షి మలిక్ పేర్కొంది. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా..? : రెజ్లర్ సాక్షి మాలిక్ ‘ఢిల్లీ పోలీసులు మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నిరసన ముగించమని ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ కట్ చేసి గేట్లు మూసేశారు. భోజనం, నీళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు. నేను ఏసీపీతో మాట్లాడాను. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన జవాబిచ్చాడు. వారు ఏం చేసినా మా ఆందోళన కొనసాగిస్తాం. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా. బ్రిజ్భూషణ్ చట్టంకంటే పెద్దవాడిగా మారిపోయాడు’. సుప్రీం కోర్టు ఆదేశాలను నేను స్వాగతిస్తున్నా: బ్రిజ్భూషణ్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నాకూ మంచిదే. విచారణలో వారికి అన్ని విధాలా సహకరిస్తా. విచారణ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ప్రశి్నంచలేదు. రెజ్లర్లు మరికొంత సమయం ఆగాల్సింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. ఎవరి పట్లా తప్పుగా వ్యవహరించలేదు. నాకు నాపై నమ్మకముంది. -
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఆటగాళ్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు మరియు ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కోరింది. లైంగిక వేధింపులపై వీడియో రికార్డింగ్లు ఉన్నా, ఏడుగురు మహిళలు వేధింపులకు గురయ్యారన్నా ఆధారాలు ఉన్నా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు పోలీసులను సైతం ప్రాసిక్యూట్ చేయాలని సూచించింది. ఈ పిటిషన్పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. -
రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్పై లైంగిక ఆరోపణలు.. రోడ్డెక్కిన రెజ్లర్లు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ మళ్లీ ధర్నాకు దిగారు. మేరీకోమ్ కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని ‘జంతర్ మంతర్’ వద్ద చేపట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు. మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గత జనవరిలో రెజ్లర్లు కొన్ని రోజులపాటు ధర్నాకు దిగారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపి మేరీకోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీతో విచారణ జరిపింది. ఇటీవల కమిటీ నివేదిక క్రీడాశాఖకు సమర్పించినా దీన్ని బహిర్గతం చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మళ్లీ రోడ్డెక్కారు. -
రా RAW రాజు
‘కాలం కలిసి రావాలి’ అంటూ కాలాన్ని మాత్రమే నమ్ముకునే వారు ఒక రకం.‘కాలం కలిసి రావాలి అంటే కష్ట పడాలి’ అనుకునే వారు రెండో రకం. ‘రైతుబిడ్డ’ విక్రమ్సింగ్ రెండో రకానికి చెందిన కుర్రాడు.తన నాయకత్వ లక్షణాలతో ‘ఆఫ్బిజినెస్’కు కొత్త వెలుగు తీసుకువచ్చాడు... హరియాణా మహేంద్రగఢ్ జిల్లాలోని మల్రా గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన విక్రమ్సింగ్ ఖరీదైన స్కూళ్లలో ఎప్పుడూ చదువుకోలేదు. ఆరవతరగతిలో మాత్రమే ఇంగ్లీష్ చదువుకునే అవకాశం వచ్చింది. స్కూల్ పూర్తయిన తరువాత పొలానికి వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు.‘ఏ పనైనా ఇష్టంగా చేయాలి. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నువ్వు కూడా చదువును ఇష్టంగా చదువుకోవాలి. చదువుకోవడం నా వల్ల కాదు అనిపిస్తే నాతో పా టు పనిచెయ్యి’ అనే వాడు నాన్న. మరోవైపు స్నేహితులు...‘నువ్వు రెజ్లర్ కాకపో తే జీవితంలో ఏది సాధించలేవు’ అనేవారు. ఆప్రాం తంలో రెజ్లింగ్ బాగా పాపులర్. ప్రైజ్మనీ కూడా భారీగా ఉండేది. స్నేహితుల మాటలతో రెజ్లర్ కావాలనే ఆశ విక్రమ్లో మొలకెత్తింది. ఎక్కడ రెజ్లింగ్ పొటీలు జరిగినా వెళ్లేవాడు. ఇది గమనించిన టీచర్ ‘నువ్వు చదువులో ముందున్నావు. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇలా రెజ్లింగ్ అంటూ ఊళ్లు తిరిగితే చదువు దెబ్బతింటుంది’ అని హెచ్చరించాడు. ఇక అప్పటి నుంచి తన మనసులో నుంచి ‘రెజ్లింగ్’ను డిలిట్ చేశాడు విక్రమ్.ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత దిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆ తరువాత కామర్స్ అండ్ ఫిన్టెక్ స్టార్టప్ ‘ఆఫ్బిజినెస్’లో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత విక్రమ్ దశ తిరిగింది. ‘ఆఫ్బిజినెస్’కు ఉన్న మూడు యూనిట్లలో ఒకటైన ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సరిౖయెన వ్యక్తుల కోసం కంపెనీ పెద్దలు చూస్తున్న సమయంలో వారికి విక్రమ్ పేరు తట్టింది. అలా విక్రమ్ ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు హెడ్ అయ్యాడు. ‘రా మెటీరియల్స్ ఎట్ లోయెస్ట్ ప్రైసెస్–గ్యారెంటీడ్’ అనే మాటలో మాంత్రికశక్తి లేకపో వచ్చు. అయితే దీన్ని కస్టమర్లలోకి బలంగా తీసుకెళ్లడంలో విక్రమ్ విజయం సాధించాడు. ఫ్రెషర్స్తో తనదైన ఒక టీమ్ను ఏర్పాటు చేసుకోని, అడుగులో అడుగు వేస్తూ మెల్లగా నడుస్తున్న యూనిట్ను పరుగెత్తేలా చేశాడు. కోట్ల టర్నోవర్కు చేర్చాడు. ‘విక్రమ్లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అంటున్నాడు ‘ఆఫ్బిజినెస్’ సీయీవో ఆశీష్ మహాపా త్రో. ‘అదృష్టం కష్టం వైపు మొగ్గు చూపుతుంది అంటారు. నేను కష్టాన్నే నమ్ముకున్నాను. రైట్ ప్లేస్లో రైట్పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటున్న 29 సంవత్సరాల విక్రమ్సింగ్ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
అమ్మాయిలకు మాత్రమే
ఆ కుస్తీ శాలకు వెళితే 35 మంది యువతులు భారీ కసరత్తులు చేస్తూ కనిపిస్తారు. హర్యానాలోని సోనిపట్లో ‘యుద్ధవీర్ అఖాడా’ మహిళా రెజ్లర్ల గురుకులంగా వాసికెక్కింది. ఉదయం 4.30 గంటలు. ఆ అమ్మాయిలంతా లేచి మొదట చేయవలసిన పని బాదం పప్పును మెత్తగా నూరి చిక్కటి పా లతో తీసుకోవడం. ఆ తర్వాత శరీరంలో చురుకుదనం తెచ్చే చిన్నపా టి వ్యాయామాలు చేయడం. ఆ తర్వాత వ్యాయామ స్థాయిని పెంచుకుంటూ వడం. ఆపై గోదాలో దిగి ఒకటి రెండు కుస్తీలు ఆడటం. ఉదయం 8.30 వరకూ ఈ శిక్షణ సాగుతుంది. ఏ మాత్రం మార్పు ఉండదు. మళ్లీ సాయంత్రం ఇలాగే నాలుగు గంటల శిక్షణ ఉంటుంది. ఢిల్లీకి గంటన్నర దూరంలో ఉన్న సోనిపట్ (హర్యాణ) అనే ఒక మోస్తారు పట్టణం శివార్లలో ఆవాల చేల పక్కన ఉన్న ‘యుద్ధ్వీర్ అఖాడా’ కేవలం మహిళా రెజ్లర్లకు ఉద్దేశించబడినది. దీనిని స్థాపించిన యుద్ధవీర్ స్వయంగా కుస్తీ యోధుడు. విశాలమైన ఈ శిక్షణా కేంద్రంలో గోడల నిండా అతడు తెచ్చిన మెడల్స్ వేలాడదీసి ఉంటాయి. ప్రస్తుతం అతడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నందువల్ల అతని తండ్రి, శిక్షకులు ఈ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 2016 నుంచి వచ్చిన ఊపు హర్యాణలో ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి పంపడం, ఆటలకు దూరంగా ఉంచడం ఆనవాయితీ. అయితే 2016 రియో ఒలింపిక్స్లో హర్యాణ నుంచి సాక్షి మాలిక్ ఒలింపిక్స్లో పతకం తేవడంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రమంతా మహిళా కుస్తీ గురించి చర్చించుకోవడం మొదలెట్టింది. అదే సంవత్సరం ఆమిర్ఖాన్ ‘దంగల్’ వచ్చి ఆడపిల్లల కుస్తీని కథాంశంగా చూపి సూపర్హిట్ కొట్టడంతో అక్కడి తల్లిదండ్రులు, ఆడపిల్లలు కుస్తీని తమ భవిష్యత్తుకు ఒక మంచి మార్గంగా భావించారు. అది గమనించిన యుద్ధ్వీర్ ఆ మరుసటి సంవత్సరం ఈ అకాడెమీని తెరిచాడు. గురుకుల విద్య యుద్ధ్ వీర్ అఖాడాలో 10 ఏళ్లు నిండిన వయసు నుంచి 15 ఏళ్ల లోపు చేరవచ్చు. 20 ఏళ్ల వయసు వచ్చేవరకు సాధన చేయాల్సి వుంటుంది. అన్నాళ్లు అక్కడే ఉండివాలి. అయితే ఈ విద్య ఉచితం కాదు. ఒక్కో స్టూడెంట్ నెలకు కనీసం 15 వేలు చెల్లించాలి. శిక్షణ ఇస్తూ మంచి ఆహారం కూడా ఇవ్వాలంటే కనీసం ఈ మాత్రం ఫీజు అవసరం అని నిర్వాహకులు అంటారు. సంప్రదాయ జిమ్తో పా టు కొయ్యదుంగను ఈడ్చడం, టైర్లను సుత్తితో బాదడం, మట్టి గోదాలో కుస్తీ ఆడటం వంటి శిక్షణ ఉంటుంది. నడుముకు బలం రావడానికి, చేతుల్లో ఒడుపు రావడానికి రకరకాల వ్యాయామాలు చేయిస్తారు. ఆశలు... ఆకాంక్షలు ఇక్కడ చేరిన వారంతా ఇప్పటికే అండర్ 15, అండర్ 17 కుస్తీ పోటీల్లో జాతీయ స్థాయిలో ఆడి పతకాలు తెస్తున్నారు. జూనియర్ ఛాంపియన్ బిపా ష దహియా ఇక్కడ ఇంకా శిక్షణలో ఉంది. కామన్వెల్త్, ఒలింపిక్స్లో ఆడి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవాలని, ఆర్మీలో చేరాలని వీరంతా భావిస్తున్నారు. ‘మేము ఐదుగురం అక్కాచెల్లెళ్లం. కొడుకు లేని కారణాన మా నాన్న మాలో ముగ్గుర్ని ఇక్కడికి పంపించాడు. మేము దృఢంగా, బలంగా ఉండాలని ఆయన కోరిక’ అని ఒకమ్మాయి అంది. సమాజంలో స్త్రీలపై ఉండే వివక్ష, హింసను తట్టుకోవడానికి మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.రెండు నిమిషాల్లో ఎత్తి కిందపడేయగల వీరిని చూస్తే ఎవరైనా సరే ఒళ్లు దగ్గర పెట్టుకోక తప్పదు మరి. అలంకరణ లేదు ఇక్కడ చేరే అమ్మాయిలందరూ మిలట్రీలోలాగా క్రాఫ్ చేయించుకోవాల్సి ఉంటుంది. టీషర్టులు, ట్రాక్ ప్యాంట్లు తప్పనిసరి. గబుక్కున చూస్తే వీరంతా అబ్బాయిలకు మల్లే కనిపిస్తారు. ఆదివారం రోజు ఇచ్చే వెసులుబాటులో సరదాగా వంట చేయడం, ఆ సాయంత్రం నృత్యంతో సేద తీరడం చేస్తారు. ‘మేమంతా స్నేహితులమే అయినా గోదాలో ఉన్న కాసేపు శత్రువులమే’ అని నవ్వుతారు. ‘ఓడినవారు ఐదు నిమిషాల్లో మాట కలిపేయాలి అనేది నియమం’ అంటారు. -
మన క్రీడాకారిణులకు బాసట ఏది?
బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి భారతీయ మహిళా రెజ్లర్లు... భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు భ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. తమను ఆయన లైంగికంగా వేధిస్తున్నారనీ, నిరంకుశంగా వ్యవ హరిస్తున్నారనేవి వారి ఆరోపణలు. ఈ ఉదంతం భారత క్రీడారంగంలోని మురికిని మరోసారి ఎత్తిచూపింది. క్రీడా సంస్థల నాయకత్వంలో ఉన్న పురుషాధిపత్యం, రాజకీయాలతో వారికున్న అవినాభావ సంబంధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఆ మధ్య హరియాణా క్రీడా మంత్రి, భారత హాకీ మాజీ క్రీడాకారుడు అయిన సందీప్ సింగ్పై మరో ప్రముఖ అథ్లెట్, మహిళా కోచ్ చండీగఢ్లో చేసిన ఆరోపణలూ దాదాపూ ఇటువంటివే. క్రీడాకారిణులకు మద్దతు ఇవ్వడమే తమ విధిగా ఉండాల్సిన మన క్రీడాధికారులు వాస్తవానికి తమ రాజకీయ బలాన్ని వారిని వేధించడానికి అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ వేధింపులను ఎదిరించినవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కుటుంబపరమైన మద్దతు ఏమాత్రం లేకుండా నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందుతూ... రక్తం, చెమట, కన్నీళ్లను పణంగా పెడుతున్న మహిళలు వీరు. వీరికి మరో వృత్తిని ఎంచుకునే అవకాశమూ ఉండదు. అవినీతి పరులైన అధికారుల చేతుల్లో వీరు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే, క్రీడల్లో మహిళలపై వేధింపునకు సంబంధించి ఇటీవల వెలికివస్తున్న కేసులు నిజానికి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. మహిళా రెజ్లర్లు తమ ప్రెస్ కాన్ఫ రెన్సులో ఎత్తి చూపినట్లుగా ఈ ప్రత్యేక సమస్యకు సంబంధించిన నిజమైన రూపం చాలా భారీ స్థాయిలో, అంత్యంత సంక్లిష్టంగా ఉంటోంది. క్రీడాకారిణులు చేస్తున్న ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంతవరకు నెలకొల్పిన సమస్యా పరిష్కార నిబంధనలు ఏమాత్రం తమ ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. పైగా తమను వేధింపులకు గురి చేస్తున్న వారి గురించి బయటపడి ఫిర్యాదు చేయడానికి ఇవి మహిళల్లో ఏమాత్రం విశ్వాసం కలిగించలేదని కూడా స్పష్టమవుతోంది. వందలాది క్రీడాకారిణులు మౌనంగా ఉంటూ అధికారులకు లోబడి ఉండటానికి ప్రధాన కారణం వారు క్రీడల నుంచి బయటపడటానికి మరొక అవకాశం లేకపోవడమేనని చెప్పాలి. శక్తిమంతులైన రాజకీయ నియామకాల ద్వారా పదవుల్లోకి వచ్చి రాజకీయ సంరక్షణలో ఉంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడటం అంత సులభం కాదని మహిళా అథ్లెట్లు, వారి కుటుంబాలకు బాగా తెలుసు. ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పాల్సి ఉంది. మన అంతర్జాతీయ క్రీడాకారిణులలో చాలామంది తమను సపోర్టు చేయడానికి తమ కుటుంబాలు తమ వనరులను మొత్తంగా వెచ్చిస్తున్నారని చెబుతూ వచ్చారు. అధికారిక ప్రవేశ ద్వారాలను వారి ముఖాలమీదే మూసివేసిన సమయంలో, జంతర్ మంతర్ వద్ద మన మహిళా రెజ్లర్ల ప్రెస్ కాన్ఫరెన్స్ని చూస్తున్నప్పుడు... కీలకమైన ప్రాక్టీస్ సీజన్లో ఇలా బయటికి వచ్చారంటే వారు ఎంత నిస్పృహకు గురై ఉంటారో కదా అని చూసేవారికి బాధ, ఆగ్రహం కలుగుతాయి. హరియాణాలో సైతం ఆ జూనియర్ మహిళా కోచ్ రాష్ట్ర క్రీడా మంత్రికి వ్యతిరేకంగా న్యాయం పొందడానికి ఒకచోటు నుంచి మరొక చోటుకి పరుగులు తీశారు. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం నిందితుడి పక్షానే నిలిచింది. ఆ రకంగా మహిళా క్రీడా కమ్యూ నిటీ మొత్తానికి అది ప్రతికూల సందేశాన్ని అందించింది. ఆరోపణలకు గురైనవారు, వారి రాజకీయ ప్రభుత్వ యంత్రాంగానికి చెందినవారు బాధితురాలినే అవమానిస్తున్నారు. పైగా లైంగిక వేధింపు కేసుల వల్ల ఆపాదించబడే సామాజిక కళంకాన్ని భరిస్తూ... తమ కెరీర్నే నిలిపివేయగలిగిన విధ్వంసకరమైన అధికారాన్ని చలాయిస్తున్న మొత్తం అధికార యంత్రాంగాన్ని ఒంటరి బాధితురాలు ఎదురించి నిలబడటం చాలా కష్టం కూడా. 1990లలో నాటి టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు, హరియాణా పోలీస్ ఐజీ ఎస్పీఎస్ రాథోడ్కు వ్యతిరేకంగా గళమెత్తిన టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్రాకు చెందిన ముఖ్యమైన ఉదంతాన్ని మననం చేసు కోవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగానూ, అనేక కుల ప్రాతిపదిక సంస్థలు ఆనాడు నిందితుడి పక్షానే నిలబడ్డాయి. ఆరోపణకు గురైన రాథోడ్ నిజానికి ప్రమోషన్ పొంది హరియాణా డీజీపీ అయ్యారు. తీవ్రమైన శత్రుపూరిత వాతావరణంలో రుచిక తన జీవి తాన్నే ముగించుకున్నారు. న్యాయం కోసం కుటుంబం సాగించిన పోరా టంలో ఆమె తండ్రి కూడా మరణించారు. ఆమె సోదరుడు జనం కంట పడకుండా ఎంతో దూరంలో జీవితం గడపాల్సి వచ్చింది. ఆమె సన్ని హిత మిత్రుడి కుటుంబం, ఇతర మహిళా సంస్థలు ఎంతో శ్రమ కోర్చి ఈ కేసును ప్రతి స్థాయిలోనూ ముందుకు తీసుకెళుతూ 19 ఏళ్ల పాటు పోరాడారు. అయినప్పటికీ నిందితుడైన రాథోడ్ ఆరునెలల జైలు శిక్షను, వెయ్యి రూపాయలు జరిమానాను మాత్రమే పొందాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నాటి నుంచి నేటివరకు మన క్రీడాకారిణుల జీవితాల్లో పెద్దగా మార్పు లేదు. తన జీవితాన్ని ముగించుకోవాలనే నిస్పృహతో కూడిన ఆలోచనల గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వినేశ్ ఫోగాట్ దీన వదనం చూసి దేశ ప్రజలు, ముఖ్యంగా క్రీడా సమాజం దిగ్భ్రాంతి చెంది ఉండాలి. ఈ రెండు కేసు ల్లోనూ ప్రసుతం అధికారంలో ఉన్న బీజేపీని, క్రీడాధికారులను తప్పక కఠిన ప్రశ్నలు వేసితీరాలి. క్రీడాకారిణులు పతకాలు తీసుక వస్తున్నప్పుడు వారు సాధించిన ఉజ్వల కీర్తిని తమ సొంతం చేసుకుని మురిసిపోవడంలో రాజకీయ నేతలు, క్రీడా సమాఖ్య అధిపతులు ముందు ఉంటున్నారు. కానీ మరోవైపున తమకు జరుగుతున్న అన్యా యానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి క్రీడాకారిణులు ప్రయత్నించిన ప్రతిసారీ ఏమాత్రం సిగ్గూ శరమూ లేకుండా నిందితులనే కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. క్రీడాకారిణులను వేధించిన కేసుల్లో అవసరమైన సమర్థ న్యాయ ప్రక్రియను తక్షణం ఏర్పర్చాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయు ల్లోని క్రీడా విభాగాలు, సమాఖ్యలు, ప్రభుత్వ క్రీడా విభాగాలు అన్నింటిలో లైంగిక వేధింపులకు వ్యతిరేక కమిటీలను తప్పక ఏర్పర్చాలి. ఈ ప్రక్రియను అనుసరించనప్పుడు, సంబంధిత అధికారులనే జవాబుదారీగా చేయాలి. మైదానంలో అత్యున్నతంగా పోరాడుతూనే తమకు న్యాయం జరగాలని గట్టిగా పోరాడుతున్న మన క్రీడాకారిణులకు సంఘీ భావం పలకడం ఈ దేశంలో క్రీడలను ప్రేమించే ప్రతి ఒక్కరి బాధ్యత. - జగ్మతి సాంగ్వాన్ వాలీబాల్ క్రీడాకారిణి, ‘ఐద్వా’ జాతీయ ఉపాధ్యక్షురాలు (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
హైదరాబాద్: కుస్తీలో పుష్ప.. తగ్గేదేలే! (ఫొటోలు)
-
కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. దూల తీరింది!
కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కుక్క రెజ్లింగ్ మ్యాచ్ ఆడడం అంటే కండలు పీక్కుతినడమే కనిపిస్తుంది. ఇక రింగ్లోకి దూసుకొచ్చిన సదరు కుక్కగారు తన ప్రత్యర్థిని మట్టికరిపించి అతని సరదాను తీర్చింది. అయితే ఇదంతా కేవలం ఫన్ కోసం మాత్రమే. బార్డర్ కోలి అనే కుక్క బర్త్డే సందర్భంగా దాని యజమాని ఇలా ప్లాన్ చేశాడు. వెస్ట్రన్ఫేర్లోని రెజ్లింగ్ రింగ్లోకి అడుగుపెట్టిన వెంటనే మ్యాట్ అంతా కలియతిరిగిన బార్డర్ కోలి ప్రేక్షకులకు అభివాదం చేసింది. తన ప్రత్యర్థి సైకో మైక్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ట్రెయినర్ ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ బార్డర్ కోలి మ్యాచ్ ఆడింది. ముందుగా అనుకున్న ప్రకారం కుక్క సైకో మైక్ మీదకు రాగానే అతను కిందపడిపోయాడు. ఆ తర్వాత రెజ్లర్ను పైకి లేవకుండా మూడుసార్లు జంప్ చేసింది. బార్డర్ కోలి షాట్లపై సైకో మైక్ తప్పంటూ అప్పీల్ చేశాడు. ఆ తర్వాత అంపైర్ మూడుసార్లు కౌంట్ చేసి బార్డర్ కోలిని విజేతగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగానే మనం పెంచుకునే కుక్కులు విశ్వాసంగా ఉంటాయి. యజమాని మాటను తుచా తప్పకుండా పాటిస్తుంటాయి. బాంబ్ స్క్వాడ్, స్పిపర్ డాగ్స్ అంటూ కొన్ని కుక్కలు విన్యాసాల్లో ఆరితేరి ఉంటాయి. వాటికిచ్చే స్పెషల్ ట్రైనింగ్ వల్ల మనషులతో సమానంగా పనిచేస్తాయి. ఇక విదేశాల్లో రాట్ వీలర్స్, పిట్బుల్స్ లాంటి కుక్కలకు ఫైటింగ్లు ఏర్పాటు చేస్తారు. ఈ ఫైట్కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఫైట్స్పై పెద్ద మొత్తంలో బెట్లు కాస్తూ కాసుల వర్షం పండించుకుంటారు. Who wants to see a BIRTHDAY-slam?! Wishing a big happy birthday to @iAmPsychoMike We hope it goes better for him than this surprise match on Saturday did... Big thanks to @JenandDaiquiri for joining forces to put on a one of a kind match at @WesternFair pic.twitter.com/iRY9R6SSO6 — Smash Wrestling (@smashwrestling) September 21, 2022 -
చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
బెల్గ్రేడ్ (సెర్బియా): నాలుగు రోజుల నిరాశాజనక ప్రదర్శన అనంతరం ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఐదో రోజు భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కాంస్య పతకంతో మెరిసింది. తద్వారా ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా 28 ఏళ్ల వినేశ్ రికార్డు నెలకొల్పింది. 2019 ప్రపంచ చాంపియన్షిప్లోనూ వినేశ్ కాంస్య పతకం సాధించింది. బుధవారం జరిగిన 53 కేజీల కాంస్య పతక బౌట్లో బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేశ్ 8–0 పాయింట్ల తేడాతో ఎమ్మా జోనా మాల్మ్గ్రెన్ (స్వీడన్)పై గెలిచింది. వాస్తవానికి మంగళవారం వినేశ్ తొలి రౌండ్లో 0–7తో ఖులాన్ బత్కుయగ్ (మంగోలియా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. అయితే ఖులాన్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం వినేశ్కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ఫైనల్ చేరిన రెజ్లర్ చేతిలో అంతకుముందు రౌండ్లలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బౌట్లు నిర్వహిస్తారు. ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో వినేశ్ 4–0తో జుల్దిజ్ ఇషిమోవా (కజకిస్తాన్)పై గెలిచింది. తదుపరి రౌండ్లో వినేశ్తో పోటీపడాల్సిన లేలా గుర్బనోవా (అజర్బైజాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత రెజ్లర్కు ‘వాకోవర్’ లభించి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం రేసులో నిషా మరోవైపు 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా కాంస్య పతకం రేసులో నిలిచింది. సెమీఫైనల్లో నిషా 4–5తో అమీ ఇషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో నిషా 11–0తో దనుతె దొమికైతె (లిథువేనియా)పై, రెండో రౌండ్లో 13–8తో అదెలా హంజ్లికోవా (చెక్ రిపబ్లిక్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో సోఫియా (బల్గేరియా)పై గెలిచింది. 2021 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన సరిత మోర్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–7తో లిసాక్ అన్హెలినా (పోలాండ్) చేతిలో... మాన్సి అహ్లావత్ క్వార్టర్ ఫైనల్లో 3–5తో జోవితా మరియా (పోలాండ్) చేతిలో... రితిక తొలి రౌండ్లో 2–6తో కెండ్రా అగస్టీన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. 🇮🇳's @Phogat_Vinesh wins her 2nd #WorldChampionship 🥉 after defeating Sweden's Joana Malmgren 8-0 Great resilience by #VineshPhogat after shocking 1st round defeat yesterday. She has now also become 1️⃣st Indian woman to have won 2️⃣ World Championships medals in #Wrestling 🤼♀️ pic.twitter.com/J0zpoWxKGz — SAI Media (@Media_SAI) September 14, 2022 -
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్ లక్ష్యంగా రవి దహియా సన్నాహాలు
వచ్చే నెలలో జరిగే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ సన్నాహాల కోసం భారత స్టార్ రెజ్లర్ రవి దహియా (57 కేజీలు) రష్యాకు బయలుదేరి వెళ్లాడు. రష్యాలో 29 రోజులపాటు సాగే రవి శిక్షణ శిబిరం ఖర్చులన్నీ కేంద్ర క్రీడా శాఖ భరించనుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్లో రవి స్వర్ణం సాధించాడు. 2019 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం సాధించి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఈ ఢిల్లీ రెజ్లర్ విశ్వ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. -
Sri Lanka Crisis: ప్రధాని బెడ్పై నిరసనకారుల రెజ్లింగ్.. వీడియో వైరల్
కొలంబో: దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని లంకేయుల కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆక్రమించారు. అనంతరం అక్కడి విలాస సదుపాయాలను కొందరు ఆందోళనకారులు ఆస్వాదించారు. భవనంలోని స్విమ్మింగ్పూల్లో దూకి ఈత కొట్టారు. కిచెన్లో వండుకుని తిన్నారు. బెడ్రూంలలో హాయిగా సేదతీరారు. జిమ్లో వర్కౌట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆయన బెడ్పై సరదాగా రెజ్లింగ్ చేశారు. ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపించేలా స్టంట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి దానికి బ్యాగ్రౌండ్లో నిజమైన రెజ్లింగ్ మ్యాచ్ కామెంటరీని కూడా జోడించారు. ఇందుకు సంబందించిన వీడియోను ఓ శ్రీలంక యూజర్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లర్లలా మారి ఆందోళనకారులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. నిజమైన మ్యాచ్ను తలపించేలా బెడ్పై ‘కుమ్మేసుకున్నారు’. వీడియోలో ఓ ఆందోళనకారుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ ర్యాండీ ఆర్టన్లా పోజులివ్వడం ఆకట్టుకుంది. Video - #WWE Wrestling on Prime Minister's bed at Temple Trees 😃#LKA #SriLanka #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/5f2zE9uqLD — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 10, 2022 అంతకుముందు అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేయాలని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధాని ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసి అధ్యక్షుడు గొటబాయ పారిపోయారు. ప్రస్తుతం ఆయన శ్రీలంక నేవీ ఓడలో ఉన్నట్లు తెలుస్తోంది. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో పదవుల నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు, ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
‘కామన్వెల్త్’కు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్
లక్నో: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భారత జట్టులో పునరాగమనం చేసింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్టులో వినేశ్ చోటు సంపాదించింది. రియో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన మరో సీనియర్ రెజ్లర్ సాక్షి మలిక్ కూడా జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. సోమవారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్లో వినేశ్ 53 కేజీల విభాగంలో... సాక్షి 62 కేజీల విభాగంలో విజే తగా నిలి చి కామన్వెల్త్ గేమ్స్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. వినేశ్, సాక్షిలతోపాటు పూజా (50 కేజీలు), అన్షు (53 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు) కూడా ‘కామన్వెల్త్’లో భారత్ తరఫున ఆడతారు. -
దీపక్కు రజతం.. రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు పతకాల పంట
ఉలాన్బాతర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2022లో గతేడాదితో (14) పోలిస్తే భారత్కు ఈ సారి 3 పతకాలు అధికంగా వచ్చాయి. ఆఖరి రోజు వచ్చిన రెండు మెడల్స్ కలుపుకుని భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు (1 స్వర్ణం, 5 రజతాలు, 11 కాంస్యాలు) చేరాయి. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా మరోసారి రజతంతో సరిపెట్టుకోగా, విక్కీ చాహర్ (92 కేజీలు) కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపక్ కజకిస్థాన్ రెజ్లర్ అజ్మత్ దౌలెత్బెకోవ్ చేతిలో 1-6 తేడాతో ఓడాడు. నిరుడు ఇదే టోర్నీలో దీపక్ రజతంతోనే సరిపెట్టుకున్నాడు. మరోవైపు విక్కీ చాహర్ రజత పోరులో 5-3తో అజినియాజ్ (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గాడు. ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో జపాన్ అత్యధికంగా 21 పతకాలు (10 స్వర్ణం, 2 రజతాలు, 9 కాంస్యాలు) సాధించగా, ఇరాన్ (15, 10 స్వర్ణం, 2 రజతాలు, 3 కాంస్యాలు), కజకిస్థాన్ (21, 5 స్వర్ణం, 8 రజతాలు, 8 కాంస్యాలు), కిర్కిస్థాన్ (14, 4 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచాయి. భారత్ 17 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. చదవండి: Formula 1: అన్స్టాపబుల్ వెర్స్టాపెన్.. కెరీర్లో 22వ విజయం -
CWG 2026: మన పతకాలకు మళ్లీ ఎసరు!
లండన్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) మన పతకావకాశాలకు మళ్లీ ఎసరు పెట్టింది. విక్టోరియా (ఆస్ట్రేలియా) రాష్ట్రంలో జరిగే తదుపరి మెగా ఈవెంట్లోనూ భారత్ ‘గురి’పెట్టలేదు. ‘పట్టు’ పట్టలేదు. కొత్తగా బహుళ వేదికల్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్లో కూడా షూటింగ్, ఆర్చరీ క్రీడాంశాలతో పాటు రెజ్లింగ్ను పక్కన పెట్టేశారు. సీడబ్ల్యూజీలో భారత్కు పతకావకాశాలున్న ఈవెంట్లు లేకపోవడంతో మళ్లీ నిరాశనే మిగిలింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హామ్ ఆతిథ్యమిచ్చే పోటీల్లో షూటింగ్, ఆర్చరీలను నిర్వహించడం లేదు. దీనిపై గతంలోనే భారత్ తమ అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చింది. ఒకానొక దశలో ‘బాయ్కాట్’ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. మొత్తం మీద బర్మింగ్హామ్ నిర్వాహకులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో సంప్రదింపులు జరిపి బుజ్జగించడంతో మిన్నకుండిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకో అడుగు ముందుకేసి రెజ్లింగ్ను తప్పించడం భారత శిబిరాన్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే. బహుళ వేదికల్లో... 2026 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య వేదికల్ని, క్రీడాంశాల్ని సీడబ్ల్యూజీ ఆర్గనైజింగ్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్క నగరానికే పరిమితమైన క్రీడలు ఇకపై బహుళ వేదికల్లో జరుగనున్నాయి. 2026 మార్చిలో విక్టోరియా రాష్ట్రంలోని మెల్బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్లాండ్ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) మాత్రం ఆతిథ్య, ముగింపు వేడుకలకు పరిమితమైంది. టి20 క్రికెట్ సహా 16 క్రీడాంశాల జాబితాను కామన్వెల్త్గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేసింది. ఇందులో షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ ఈవెంట్లు లేవు. సీజీఎఫ్ నియమావళి ప్రకారం ఆతిథ్య దేశం తమ విచక్షణాధికారం మేరకు క్రీడాంశాలను పక్కనబెట్టొచ్చు. ఆస్ట్రేలియా చాలాసార్లు కామన్వెల్త్కు ఆతిథ్యమిచ్చింది. తొలిసారి సిడ్నీ (1938) అనంతరం పెర్త్ (1962), బ్రిస్బేన్ (1982), గోల్ట్కోస్ట్ (2018)లలో మెగా ఈవెంట్స్ జరిగాయి. బెండిగో వేదికపై 2004లో యూత్ కామన్వెల్త్ గేమ్స్ పోటీలు కూడా జరిగాయి. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్కు మతి భ్రమించిందా..? -
ఆర్ఆర్ఆర్ సినీ ప్రియులకు.. అయితే, కెకెకె క్రీడాభిమానులకు.. కాస్కో... చూస్కో...
సాక్షి క్రీడా విభాగం: ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్. తెగ ఆకర్షిస్తోంది. ఇది పూర్తిగా సినీ ప్రియులకు సంబంధించిన వ్యవహారం. అలాగే ఈ ఏడాది కె.కె.కె (క్రికెట్... క్రీడలు... ఖేల్) కూడా కనీవినీ ఎరుగని రీతిలో అలరించేందుకు, అదరగొట్టేందుకు, బ్రహ్మాండాన్ని బద్దలు చేసేందుకు ముస్తాబైంది. ఈ కె.కె.కె ప్రత్యేకతలు తెలుసుకుందాం. క్రికెట్ విషయానికొస్తే ఐపీఎల్ మెగా వేలం నుంచి లీగ్ దాకా, అలాగే పురుషుల టి20 ప్రపంచకప్, కుర్రాళ్లు (అండర్–19), అమ్మాయిల ప్రపంచకప్ (వన్డే)లు, ఇతరత్రా టోర్నీలున్నాయి. క్రీడలు... అంటే ఈ ఏడాది జరగబోయే మెగా ఈవెంట్స్ అన్నీ లోకాన్నే మైదానంలో కూర్చోబెట్టేంత రద్దీతో ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఫుట్బాల్ ప్రపంచకప్, వింటర్ ఒలింపిక్స్ ఇలా దేనికదే తీసిపోనంత ప్రతిష్టాత్మక ఈవెంట్లు. అన్నీ సై అంటే సై అనే క్రీడలే! ఖేల్... అంటే క్రికెట్, మెగా ఈవెంట్లు కాకుండా జరిగే టోర్నీలు. ప్రపంచ అథ్లెటిక్స్, ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు, ప్రపంచ ఆర్చరీకప్, ప్రపంచకప్ షూటింగ్ పోటీలతో పాటు రెగ్యులర్ గ్రాండ్స్లామ్ టోర్నీలు, బ్యాడ్మింటన్ చాంపియన్షిప్, ఫార్ములావన్ రేసింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ పంచ్లతో ఈ పన్నెండు నెలలు పండంటి వినోదమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ► అండర్–19 క్రికెట్ వరల్డ్కప్ వేదిక: వెస్టిండీస్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ► మహిళల క్రికెట్ వన్డే వరల్డ్కప్ వేదిక: న్యూజిలాండ్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ► భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ దక్షిణాఫ్రికాలో పర్యటన జనవరి 3 నుంచి 23 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు ► ఐపీఎల్–2022 మెగా వేలం వేదిక: బెంగళూరు ఫిబ్రవరి 12, 13 ► భారత్లో వెస్టిండీస్ పర్యటన ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్లు ► భారత్లో శ్రీలంక పర్యటన ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 2 టెస్టులు, 3 టి20 మ్యాచ్లు ► భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన జూన్ 9 నుంచి 19 వరకు 5 టి20 మ్యాచ్లు ► ఇంగ్లండ్లో భారత్ పర్యటన జూలై 1 నుంచి 17 వరకు 1 టెస్టు, 3 టి20లు, 3 వన్డేలు ► న్యూజిలాండ్లో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఫిబ్రవరి 5 నుంచి 24 వరకు 1 టి20 మ్యాచ్, 5 వన్డేలు ► ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1)లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. మార్చి 20న బహ్రెయిన్ గ్రాండ్ప్రితో ఎఫ్1 సీజన్ మొదలవుతుంది. అనంతరం సౌదీ అరేబియా (మార్చి 27), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 10), ఇటలీ (ఏప్రిల్ 24), మయామి–యూఎస్ఏ (మే 8), స్పెయిన్ (మే 22), మొనాకో (మే 29), అజర్బైజాన్ (జూన్ 12), కెనడా (జూన్ 19), బ్రిటన్ (జూలై 3), ఆస్ట్రియా (జూలై 10), ఫ్రాన్స్ (జూలై 24), హంగేరి (జూలై 31), బెల్జియం (ఆగస్టు 28), నెదర్లాండ్స్ (సెప్టెంబర్ 4), ఇటలీ (సెప్టెంబర్ 11), రష్యా (సెప్టెంబర్ 25), సింగపూర్ (అక్టోబర్ 2), జపాన్ (అక్టోబర్ 9), ఆస్టిన్–యూఎస్ఏ (అక్టోబర్ 23), మెక్సికో (అక్టోబర్ 30), బ్రెజిల్ (నవంబర్ 13) గ్రాండ్ప్రి రేసులు ఉన్నాయి. చివరగా నవంబర్ 20న అబుదాబి గ్రాండ్ప్రి రేసుతో సీజన్ ముగుస్తుంది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ వేదిక: ఇస్తాంబుల్ (టర్కీ) మే 6 నుంచి 21 వరకు ► వింటర్ ఒలింపిక్స్ వేదిక: బీజింగ్ (చైనా) ఫిబ్రవరి 4–20 పాల్గొనే దేశాలు: 84 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 10–25 ► ఫుట్బాల్ ప్రపంచకప్ వేదిక: ఖతర్ నవంబర్ 21–డిసెంబర్ 18 పాల్గొనే జట్లు: 32 ► ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ వేదిక: ఒరెగాన్ (అమెరికా) జూలై 15–24 ► ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూన్ 26–జూలై 7 ► ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 10–18 ► పురుషుల టి20 క్రికెట్ వరల్డ్కప్ వేదిక: ఆస్ట్రేలియా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 షూటింగ్ ► ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ వేదిక: రబాట్ (మొరాకో); ఫిబ్రవరి 7–18 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: కైరో (ఈజిప్ట్); ఫిబ్రవరి 26–మార్చి 8 ► ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ వేదిక: నికోసియా (సైప్రస్); మార్చి 8–19 ► ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ వేదిక: లిమా (పెరూ); మార్చి 27–ఏప్రిల్ 7 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: రియో డి జనీరో (బ్రెజిల్); ఏప్రిల్ 9–19 ► ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ వేదిక: లొనాటో (ఇటలీ); ఏప్రిల్ 19–30 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ వేదిక: బాకు (అజర్బైజాన్); మే 27–జూన్ 9 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ వేదిక: చాంగ్వాన్ (కొరియా); జూలై 9–22 ► ప్రపంచ షాట్గన్ చాంపియన్షిప్ వేదిక: క్రొయేషియా; సెప్టెంబర్ 27– అక్టోబర్ 10 ► ప్రపంచ రైఫిల్, పిస్టల్ చాంపియన్షిప్ వేదిక: కైరో (ఈజిప్ట్); అక్టోబర్ 12–25 ఆర్చరీ ► ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ వేదిక: అంటాల్యా; ఏప్రిల్ 18–24 ► ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ వేదిక: గ్వాంగ్జు; మే 16–22 ► ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ వేదిక: పారిస్ (ఫ్రాన్స్); జూన్ 20–26 ► ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీ వేదిక: మెడెలిన్ (కొలంబియా); జూలై 18–24 బ్యాడ్మింటన్ ► ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 11–16 ► సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో జనవరి 18 –23 ► ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్హమ్; మార్చి 16 –20 ► థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వేదిక: బ్యాంకాక్; మే 8 –15 ► ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా;జూన్ 14 –19 ► ప్రపంచ చాంపియన్షిప్ వేదిక: టోక్యో; ఆగస్టు 21 –28 ► వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ వేదిక: గ్వాంగ్జౌ;డిసెంబర్ 14 –18 ► టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్ జనవరి 17–30 ► ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్ మే 22– జూన్ 5 ► వింబుల్డన్ ఓపెన్ వేదిక: లండన్; జూన్ 27–జూలై 10 ► యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 29–సెప్టెంబర్ 11 -
హైదరాబాద్ వాసికి అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి,మణికొండ( హైదరాబాద్): రెజ్లింగ్లో అంతర్జాతీయ రెఫరీగా నార్సింగి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన శ్రీకాంత్యాదవ్ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న ఆయన సత్తా చాటడంతో ఆయనను ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పోటీలకు రెఫరీగా పనిచేసే అవకాశం లబించిందని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. అంతర్జాతీయ రెఫరీయింగ్ డైరెక్టర్ దుర్గే, ఒలంపిక్ రిఫరీ అశోక్ల చేతుల మీదుగా ఆయన తన అంతర్జాతీయ రెఫరీ దృవపత్రాన్ని అందుకున్నానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రెజ్లింగ్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే అవకాశం మాత్రమే ఉండేదని, తన ఎంపికతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసి అవకాశం లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది -
‘అప్పుడు ఎందుకు నవ్వలేదు’.. రవిని ప్రశ్నించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో భేటీ సందర్భంగా ఓ పతకధారిని ఉద్దేశించి ప్రధాని మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో రవి దహియా రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, రవి బౌట్లో ఎప్పుడూ గంభీరంగా ఉంటాడని, మెడల్ మ్యాచ్ అనంతరం పతకం అందుకున్న సమయంలోనూ నవ్వలేదని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. సాధారణంగా హర్యానాకు చెందినవారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు, దేశం గర్వించే గొప్ప విజయాన్ని సాధించిన సందర్భంగా కూడా నీ ముఖంలో చిరు నవ్వు కనిపించలేదేమంటూ రవి దహియాను మోదీ ప్రశ్నించారు. ఇందుకు రవి దహియా బదులిస్తూ.. అప్పుడు తాను నెర్వస్గా ఉన్నానని, అందుకే తన ముఖంలో ఎటువంటి హావభావాలను పలకలేదని, ప్రస్తుతం తాను కుదుటపడ్డానని ప్రధానికి చెప్పుకొచ్చాడు. కాగా, హర్యానాకు చెందిన 23 ఏళ్ల రవి దాహియా టోక్యో ఒలింపిక్స్లో కొలంబియా, బల్గేరియా, కజకిస్తాన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్కు చేరాడు. ఫైనల్లో రష్యా రెజ్లర్తో భీకరంగా పోరాడి రజత పతకంతో మెరిశాడు. చదవండి: లివింగ్స్టోన్ ఊచకోత.. 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 92 నాటౌట్ -
Vinesh Phogat: ఇక రెజ్లింగ్కు తిరిగొస్తానో లేదో!
ఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన ఆమెపై క్రమశిక్షణ చర్యల కింద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్య్లూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వినేశ్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు రాసిన కాలమ్లో..'ఇక రెజ్లింగ్కు తిరిగొస్తానో రానో' అంటూ కామెంట్ చేయడం ఆసక్తి కలిగించింది. ''భారత్లో ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా పతనమవుతారని నాకు తెలుసు. ఒక్క మెడల్ పోయిందంటే ఇక అంతే. పని ముగిసినట్లే. రెజ్లింగ్లోకి నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు.. రాకపోవచ్చు కూడా. నా కాలు విరిగినప్పుడే బాగుంది. ఇప్పుడు నా శరీరం విరగలేదు కానీ.. మనసు మాత్రం కుంగిపోయింది.'' అని చెప్పుకొచ్చింది. ఒలింపిక్స్కు ముందు 2017లో కాంకషన్కు గురవడం, ఆ తర్వాత రెండుసార్లు కొవిడ్ బారిన పడి కోలుకున్న వినేశ్ తాజా వ్యాఖ్యలతో కెరీర్ ఇక ముగిసినట్టేనా అని కొంతమంది భావిస్తున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ 53 కేజీల రెజ్లింగ్ కేటగిరిలో పోటీ పడిన ఆమె పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ క్వార్టర్ఫైనల్లోనే ఓడిపోయి వినేశ్ ఇంటిదారి పట్టింది. -
స్టార్లుగా ఊహించుకుంటున్నారు: సోనం మాలిక్కు నోటీసు
న్యూఢిల్లీ: తొలిసారి ఒలింపిక్స్కు అర్హత పొందిన మరో మహిళా రెజ్లర్ సోనమ్ మాలిక్ టోక్యో బయల్దేరడానికి ముందు పాస్పోర్ట్ను డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆమె మాత్రం తన పాస్పోర్ట్ను తీసుకొని రావాలని ఏకంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను ఆజ్ఞాపించింది. రెజ్లర్ల క్రమశిక్షణా రాహిత్యం ఆ నోటా ఈ నోటా భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) తెలిసింది. రెజ్లర్లు ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం ఏమాత్రం రుచించని ఐఓఏ... ‘మీ క్రీడాకారుల్ని మీరు నియంత్రించలేరా’ అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను తలంటింది. ఈ క్రమంలో సోనమ్ మాలిక్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘కెరీర్ మొదట్లోనే వీళ్లు తమను తాము స్టార్లుగా ఊహించుకుంటున్నారు. అందుకే విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇదే మాత్రం క్షమించరానిది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఈ సందర్భంగా చెప్పారు. ఇక టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: గర్ల్ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ